తెలంగాణలో కొత్తగా 491 కరోనా కేసులు.. మరో ముగ్గురు మృతి...
తెలంగాణలో కొత్తగా 491 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా మరో ముగ్గురు కరోనాతో మృతి చెందారు. మరో 587 కేసుల రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. ఈమేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంగళవారం (డిసెంబర్ 15) హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
Recommended Video
తాజా కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,78,599కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 1499కి చేరింది. ప్రస్తుతం 7,272 యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి. మరో 5169 మంది పేషెంట్లు హోమ్ ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు.గడిచిన 24 గంటల్లో596 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 2,69,828కి చేరింది.
గడిచిన 24గంటల్లో మొత్తం 48,005 శాంపిల్స్ను పరీక్షించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకూ నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 62,05,688కి చేరింది. ఒక మిలియన్ జనాభాకు సగటున 1,66,729 కరోనా టెస్టులు చేస్తున్నట్లు బులెటిన్లో వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో మరణాల రేటు 1.5శాతం ఉండగా... తెలంగాణలో 0.53శాతం ఉన్నట్లు తెలిపారు. జాతీయ స్థాయిలో రికవరీ రేటు 95.1 శాతం ఉండగా తెలంగాణలో 96.85శాతం ఉన్నట్లు తెలిపారు. తాజాగా నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 102, రంగారెడ్డి జిల్లాలో 35 కరోనా కేసులు నమోదయ్యాయి.
దేశవ్యాప్తంగా గడిచిన 24గంటల్లో కొత్తగా 22,065 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 99,06,165కి చేరింది. మరో 354 మంది కరోనాతో మృతి చెందారు. మొత్తం మృతుల సంఖ్య 1,43,709కి చేరగా ప్రస్తుతం 3,39,820 యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి.