Siddipeta: 16 ఏళ్ల బాలుడితో పాటు లేచిపోయిన ఆంటీ..!
ఒక్కోసారి కొన్ని సంఘటనలు చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. ఏమిటీ విడ్డూరం.. ఏమిటీ వింత అని ముక్కున వేలేసుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఈ ఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది. ఈ ఘటనతో అస్సలు సమాజంలో ఏం జరుగుతుందని ఆలోచన రాక మానదు. ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ యజమాని కుమారుడిపై ఓ వివాహిత కన్ను వేసింది. అయితే ఆ అబ్బాయి మైనర్.. 16 ఏళ్ల వయస్సులోనే ఉన్నాడు. అయినా కూడా సదరు మహిళ బాలుడిని లోబర్చుకుంది.
శరీరకంగా వాడుకుంది. చివరికి విషయం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లడంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. సిద్దిపేటలోని హనుమాన్ నగర్ లో రాధ అనే వివాహిత.. భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి ఓ ఇంట్లో నివసిస్తోంది. మూడేళ్లుగా అదే ఇంట్లో ఉంటుంది. గత కొద్ది రోజులుగా ఈ క్రమంలో 16 ఏళ్ల ఇంటి యజమాని కొడుకుపై సదరు మహిళ సన్నిహితంగా ఉంది. బాలుడిని మాటలతో లోబర్చుకుని శారీరకంగా వాడుకుంది. బాలుడితో పాటు లేచిపోవాలని నిర్ణయించుకుంది. జనవరి 22న 2024 లేచిపోవాలని ప్లాన్ వేసింది.

ఇంట్లో ఉన్న నగలు, డబ్బు తీసుకుని బాలుడితో కలిసి భర్త, పిల్లలను వదిలేసి లేచిపోయింది. బాలుడితో కలిసి చెన్నై వెళ్లింది. బాలుడితో కలిసి నగలు అమ్మి జల్సా చేసింది. అయితే ఇంటి యజమాని తన కుమారుడు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేయించారు. వివాహిత బాలుడితో చెన్నైలో ఉన్నట్లు గుర్తించారు. తమ కోసం పోలీసులు వెతుకుతున్నారని తెలుసుకున్న సదరు మహిళ.. బాలుడిని సిద్దిపేటలో వదిలేసి వెళ్లింది.
సిద్దిపేటకు వచ్చిన బాలుడిని పోలీసులు విచారించారు. సదరు మహిళ బలవంతంగా శారీరకంగా కలవమని ఇబ్బంది పెట్టిందన్నాడు. చెన్నైలో ఓ రూమ్ కిరాయికి తీసుకుని ఉన్నట్లు పేర్కొన్నాడు. బంగారు నగలను చెన్నైలో అమ్మితే డబ్బులు వచ్చినట్లు వివరించాడు.












Click it and Unblock the Notifications