ఆటోలో కొడుకును వదిలేసి పరారీ, భర్తకు ఫోన్: విద్యార్థిని ఆత్మహత్య
నల్గొండ: జిల్లాలోని సూర్యాపేట పాత బస్టాండ్ సమీపంలో ఓ తల్లి ఏడాదిన్నర బాబును ఆటోలో వదిలేసి వెళ్లిపోయింది. అనంతరం ఈ విషయాన్ని భర్తకు ఫోన్ చేసి చెప్పింది. భర్త వెంటనే ఆ ప్రాంతానికి చేరుకుని బాబును స్థానికులకు అప్పగించి భార్యను వెతుక్కుంటూ వెళ్లిపోయాడు.
చిన్నారిని స్థానికులు సూర్యాపేట పోలీస్స్టేషన్లో అప్పగించారు. ఈ దారుణానికి ఒడిగట్టిన మహిళను పెన్పహాడ్ మండలం పెదసీతారాంతండా మహిళగా గుర్తించారు. అయితే ఆమె వెళ్లిపోవడానికి భార్యాభర్తల మధ్య గొడవలే కారణమా? లేక మరేదైనా కారణం ఉందా? అనే విషయాలు తెలియాల్సి ఉంది.

కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న విద్యార్థిని
నల్గొండ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. వేములపల్లి మండలం చెట్టిపాలెంలో పదోతరగతి విద్యార్థిని భార్గవి కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
కాగా, ప్రేమ వేధింపులే విద్యార్థిని మృతికి కారణమని తెలుస్తోంది. వేణు అనే యువకుడి వేధింపులు తాళలేక భార్గవి ఆత్మహత్య చేసుకుందని బంధువులు ఆరోపిస్తున్నారు. అతడ్ని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications