విషాదం: రైల్వే ట్రాక్ వద్ద ఇన్స్టా రీల్స్ చేస్తూ రైలు ఢీకొని యువకుడు మృతి
హైదరాబాద్: సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోవాలని కొందరు యువకులు ప్రమాదకరమైన ఫీట్స్ చేస్తూ తమ ప్రాణాలకుమీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా, నగరంలోని ఓ యువకుడు ఇన్స్టా రీల్స్ చేస్తూ దుర్మరణం పాలయ్యాడు. రైల్వేట్రాక్పై ఇన్స్టా రీల్స్ చేస్తుండగా.. రైలు ఢీకొని సర్పరాజ్(16) అనే విద్యార్థి మృతి చెందాడు. హైదరాబాద్ నగరంలోని సనత్నగర్ రైల్వే లైన్ సమీపంలో శుక్రవారం ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.
ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సనత్నగర్ రైల్వే ట్రాక్ వద్దకు ముగ్గురు స్నేహితులు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయడానికి వెళ్లారు. మధ్యాహ్న సమయంలో ఇన్ స్టా రీల్స్ చేస్తుండగా వేగంగా వచ్చిన రైలు ఢీకొనడంతో సర్పరాజ్ అనే విద్యార్థి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు రహ్మత్ నగర్ డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్ కాలనీలోని మదర్సాలో విద్యాభ్యాసం చేస్తున్నాడు.

కాగా, మరో ఇద్దరు ఇద్దరు విద్యార్థులు రైలు రాకను గమనించి పక్కకు తప్పుకోవడంతో సురక్షితంగా బయటపడ్డారు. ఘటనపై సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలం వద్ద లభించిన మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. సర్పరాజ్కు సోషల్ మీడియా ఖాతా ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సర్పరాజ్ మృతి అతని కుటుంబంతోపాటు స్థానికంగా విషాదాన్ని నింపింది.
-
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
ఇంటర్నెట్ లేకుండానే "ఇన్స్టాగ్రామ్" రీల్స్ చూడడం ఎలాగంటే..? -
సింగర్ గానే షేక్ చేసేసింది.. డాన్సర్గా అంటే థియేటర్స్ తగలబడడమే !! -
IPL ప్రారంభం వేళ వారికి సజ్జనార్ హెచ్చరికలు..!! -
మూసీ తీరాన మహత్తరం -
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది!












Click it and Unblock the Notifications