ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సెల్‌ఫోన్ కోసమేనా? హాస్టల్‌లో విద్యార్థుల ఘర్షణ: ఓ విద్యార్థి మృతి

|
Google Oneindia TeluguNews

ఖమ్మం: ప్రభుత్వ గిరిజన ఆశ్రమ వసతి గృహంలో విషాద ఘటన చోటు చేసుకుంది. విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణ ఓ విద్యార్థి ప్రాణాన్ని బలిగొంది. ఈ ఘటనలో నాలుగో తరగతి విద్యార్థి ఒకరు మృతిచెందారు.

వసతి గృహంలోని నాలుగు, పదో తరగతి విద్యార్థుల మధ్య ఘర్షణ తలెత్తి పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో నాలుగో తరగతి విద్యార్థి జోసెఫ్‌ (10) మృతిచెందాడు.

A student killed in a hostel in Khammam

పదో తరగతి విద్యార్థి ఒకరు దాడి చేయడంతో జోసెఫ్‌ మృతి చెంది ఉంటాడనే అనుమానంతో ఆ విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. జోసెఫ్‌ మృతదేహాన్ని ఓ పెట్టెలో పెట్టినట్లు సమాచారం.

వార్డెన్‌ ప్రతాప్‌ సింగ్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన నేపథ్యంలో వసతిగృహం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. విద్యార్థుల మధ్య సెల్ విషయంలో గొడవ జరిగినట్లు సమాచారం.

English summary
A student killed in a hostel in Khammam on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X