విషాదం: తాజ్మహల్ హోటల్పై నుంచి దూకి యువకుడి ఆత్మహత్య
హైదరాబాద్: నగరంలోని నారాయణగూడలో విషాద ఘటన చోటు చేసుకుంది. శుక్రవారం రాత్రి నారాయణగూడలోని తాజ్ మహల్ హోటల్ భవనం ఐదో అంతస్తు నుంచి దూకి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
తాజ్ మహల్ హోటల్లో పనిచేస్తున్న ఒడిశాకు చెందిన లక్ష్మయ్య(17) అనే యువకుడు అప్పటి వరకు తన స్నేహితులతో మాట్లాడుతూ సాధారణంగానే ఉన్నాడు. ఏం జరిగిందో ఏమోగానీ, ఒక్కసారిగా హోటల్ భవనంపైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటనను హోటల్ యాజమాన్యం గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications