గొర్రెల పంపిణీ స్కాం: నలుగురు అధికారుల అరెస్ట్
కామారెడ్డి: గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన గొర్రెల పంపిణీలో అక్రమాల కేసులో అరెస్టులు ప్రారంభమయ్యాయి. ఈ స్కాంపై విచారణ జరుపుతున్న అవినీతి నిరోధక శాఖ అధికారులు గురువారం నలుగురు సీనియర్ ప్రభుత్వ అధికారులను అరెస్టు చేశారు.
అరెస్టైన వారిలో కామారెడ్డి వెటర్నరీ ఏరియా ఆస్పత్రి అసిస్టెంట్ డైరెక్టర్ ధర్మపురి రవి, మేడ్చల్ పశుసంర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ముంత ఆదిత్య కేశవ సాయి, రంగారెడ్డి జిల్లా భూగర్బ జల అధికారి రఘుపతి రెడ్డి, వయోజన విద్య డిప్యూటీ డైరెక్టర్ సంగు గణేష్ ఉన్నారు.

గొర్రెల పంపిణీలో భారీగా అవకతవకలు జరిగాయనే ఆరోపణ నేపథ్యంలో ఏసీబీ అధికారులు గత కొద్ది రోజులుగా దర్యాప్తు చేస్తున్నారు. రికార్డుల పరిశీలన, బాధితుల నుంచి వివరాలు సేకరించి విచారణ చేపట్టారు.
బినామీల పేర్లతో నిధులను దారి మళ్లించారనే ఆధారాలను సేకరించారు. ఈ కేసులో పశుసంవర్ధక శాఖ ఉన్నతాధికారులు, కాంట్రాక్టర్ల పాత్రలపైనా ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇటీవల కాగ్ కూడా ఈ పథకంలో భారీగా అవకతవకలు జరిగాయని తన నివేదికలో వెల్లడించింది.
గొర్రెల పంపిణీలో అవకతవకలకు పాల్పడి రూ. 2.10 కోట్లు కాజేశారు అధికారులు. గొర్రెలను కొనుగోలుదారులకు డబ్బులు చెల్లించకుండా బ్రోకర్ల అకౌంట్లో డబ్బులు డిపాజిట్ చేశారు. గుంటూరు జిల్లాకు చెందిన గొర్రెల పెంపకందారులు ఇచ్చిన ఫిర్యాదుతో ఏసీబీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications