రూ.30 లక్షలు, నగల కొనుగోలుపై నోరు మెదపని తహశీల్దార్ సుజాత, నేడు మరోసారి విచారణ,అరెస్ట్...?
షేక్పేట భూముల వ్యవహారంలో తహశీల్దార్ సుజాత అక్రమాలు ఒక్కొక్కటి వెలుగుచూస్తున్నాయి. తన ఇంట్లో దొరికన రూ.30 లక్షల గురించి సుజాత.. పొంతనలేని సమాధానాలు చెబుతుందని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. నిన్న నాంపల్లి ఏసీబీ కార్యాలయంలో సుదీర్ఘంగా విచారించిన.. ఆ నగదుకు సంబంధించిన వివరాలేమీ తెలియరాలేదు.
నగదుకు సంబంధించిన ఆధారాలు చూపించకపోవడంతో అక్రమాలు జరిగింది నిజమేనని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. నగదుతోపాటు నగల కొనుగోలుపై డాక్యుమెంట్స్ లేవు. కానీ జీతం డబ్బులు మాత్రం బ్యాంకు నుంచి విత్ డ్రా చేశానని చెప్పారు. కానీ బ్యాంకు నుంచి తీసిన డబ్బులకు సంబంధించి ఆధారాలు కూడా చూపించలేదు.

రూ.30 లక్షలు, నగదు కాకుండా మరిన్ని భూములు పత్రాలను ఏసీబీ అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది. భూ వ్యవహారంలో సంబంధం ఉన్న అందరినీ ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. సుజాత కాల్ రికార్డును పరిశీలిస్తున్నారు.
అందులో ఉన్న వారి పేర్ల ఆధారంగా విచారణ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఆర్డీవో వసంతకుమారిని విచారించారు. ఆర్ఐ నాగార్జున రెడ్డి, ఎస్సై రవీందర్ నాయక్ ఎంక్వైరీ గత రెండురోజుల నుంచి కొనసాగుతోంది. సుజాతతోపాటు వీరిద్దరీ స్టేట్ మెంట్లను రికార్డ్ చేశారు. సోమవారం సుజాతను మరోసారి విచారించి.. లంచం కేసులో పాత్ర ఉంది అని తేలితే రిమాండ్కు తరలించే అవకాశం ఉంది.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications