వామ్మో.. తెలంగాణలో చిక్కిన భారీ తిమింగలం
తెలంగాణలో భారీ అవినీతి తిమింగలం చిక్కింది. TGSPDCL హైదరాబాద్ లో ఏడీఈగా పనిచేస్తున్న అంబేడ్కర్ అనే అధికారి ఇంటిపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ మేరకు అంబేద్కర్ పై అక్రమాస్తుల కేసు నమోదైంది. అతని ఆస్తులు చూసి అధికారులు ఆశ్చర్యపోయారు.
శేరిలింగంపల్లిలో ఒక ఫ్లాట్, గచ్చిబౌలిలో ఆరంతస్తుల బిల్డింగ్, 10 ఎకరాల్లో ఆమ్తర్ కెమికల్స్ పేరిట కంపెనీ, హైదరాబాద్ లో 6 రెసిడెన్షియల్ ప్లాట్స్, 1 ఫామ్ ల్యాండ్ అలాగే 2 ఫోర్ వీలర్లు, బంగారం, బ్యాంకు డిపాజిట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. బినామీ సతీష్ ఇంట్లో రూ. 2.18 కోట్లు స్వాధీనం చేసుకుంది. మొత్తం ఆస్తుల విలువ రూ.300 కోట్లు ఉంటుందని అంచనా వేశారు.
ఏసీబీ అధికారులు అంబేడ్కర్ ఇళ్లు, ఆయన బంధువులు, కుటుంబసభ్యుల ఇళ్లలో ముమ్మరంగా సోదాలు నిర్వహించింది. అయితే విద్యుత్ శాఖలో అవినీతి అధికారి వ్యవహారం బట్టబయలు కావడంతో చర్చనీయాంశమైంది. అంబేడ్కర్ ఆస్తులపై సోదాలు ముగిసిన అనంతరం ఆయనను అరెస్టు చేసింది. కోర్టులో ప్రవేశపెట్టగా 14 రోజుల రిమాండ్ విధించింది.

ఏడీఈగా పనిచేస్తున్న అంబేడ్కర్ పై ఫిర్యాదులు రావడంతో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. అంబేడ్కర్ ప్రస్తుతం కొండాపూర్ లోని మేఘన లేక్ వ్యూ అపార్ట్మెంట్లోని మూడో అంతస్తులో ఉంటున్నాడు. ఈయనపై ఇప్పటికే అనేక అవినీతి ఆరోపణలున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. తమకు అందిన ఫిర్యాదులతో రంగంలోకి దిగిన ఏసీబీ కేసు నమోదు చేసి సోదాలు చేపట్టింది.
-
ఎవరికీ తెలియని అందమైన అడవి.. హైదరాబాద్ కు 40 కి. మీ. దూరంలోనే.. -
ఉచిత బస్సు ప్రయాణం చేసేవారికి ఆర్టీసీ మరో శుభవార్త! -
హైదరాబాద్ లో అమ్మేది నెయ్యి కాదు..! కొంటే మీరు షెడ్డుకే..! -
ఆ హీరోయిన్ ను పెళ్లాడనున్న ఆనంద్ దేవరకొండ..? -
ఆశలు ఆవిరి చేస్తోన్న బంగారం ధరలు -
పనిలో పని.. పాకిస్థాన్ నూ లేపేస్తే పోలా..!! -
జాక్పాట్ కొట్టిన సంజు శాంసన్..!! -
14 ఏళ్లుగా కింగ్ నాగార్జున రికార్డును బీట్ చేయలేకపోతున్న హీరోలు -
బాలయ్య - గోపీచంద్ మలినేని మూవీలో విలన్గా మంచు హీరో..! -
విజయ్ రూ. 250 కోట్ల భరణం? -
Nitish Kumar: బీహార్ సీఎం నితీశ్ కుమార్ రాజీనామా? రేపే నామినేషన్..! -
పాతాళానికి దిగజారుతున్న బంగారం ధరలు












Click it and Unblock the Notifications