భద్రకాళి టెంపుల్: భక్తులపైకి దూసుకెళ్లిన కారు, ఆరుగురికి తీవ్రగాయాలు
వరంగల్లోని భద్రకాళి ఆలయం సమీపంలో ప్రమాదం చోటు చేసుకుంది. పూజ కోసం వచ్చిన ఓ కొత్త కారు అదుపుతప్పి భక్తు పైకి దూసుకెళ్ళిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు భక్తుకు తీవ్ర గాయాయ్యాయి.
వరంగల్: వరంగల్లోని భద్రకాళి ఆలయం సమీపంలో ప్రమాదం చోటు చేసుకుంది. పూజ కోసం వచ్చిన ఓ కొత్త కారు అదుపుతప్పి భక్తులపైకి దూసుకెళ్ళిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి.
మట్టెవాడ ఎస్ఐ నర్సింహారావు తెలిపిన వివరాల ప్రకారం... హన్మకొండకు చెందిన పరుచూరి శివాజి కొత్తగా కొనుగోు చేసిన బ్రీజా కారుకు పూజ చేయించేందుకు భద్రకాళి దేవాలయానికి వచ్చాడు. పూజా కార్యక్రమాల పూర్తిచేసిన తరువాత అర్చకుడు వాహనం స్టార్ట్ చేయమని చెప్పడంతో బ్రేక్పై కారు వేయబోయి ఎక్స్లేటర్పై వేశాడు. దీంతో కారు అదుపు తప్పి ఆలయ ప్రాంగణంలోని భక్తు పైకి దూసుకెళ్లింది.
ఈ ఘటనలో అక్కడే మరొక కొత్త కారుతో పూజ కోసం వేచి ఉన్న భూపాపల్లికి చెందిన ప్రశాంత్ కుటుంబసభ్యుకు ఆరుగురికి బలమైన గాయాలు కాగా, రెండు ద్విచక్ర వాహనాలు, మరో కొత్త కారు సైతం దెబ్బతింది.
ఈ ప్రమాదంలో గాయపడిన భక్తులు భూపాపల్లి కృష్ణాకాలనీకి చెందిన ప్రశాంత్, గోపి, వీరన్న, ధారావత్ శౌకిర్ (రెండు సంవత్సరాల బాలుడు), ప్రవళికతోపాటు భిక్షాటన చేసే మహిళ చంద్రమ్మను వెంటనే ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నర్సింహారావు తెలిపారు.