ఆరు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన ఎంఐఎం అధినేత ఒవైసీ: కొత్తగా ఆ రెండు స్థానాల్లో పోటీ
హైదరాబాద్: తెలంగాణలో కొద్ది రోజుల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం (AIMIM పార్టీ తొమ్మిది స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది. శుక్రవారం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ పోటీ చేసే అభ్యర్థుల వివరాలను వెల్లడించారు. కొత్తగా పోటీ చేసే మరో రెండు స్థానాలకు అభ్యర్థులను త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు.
చాంద్రాయణ గుట్ట నుంచి అక్బరుద్దీన్ ఒవైసీ, నాంపల్లి నుంచి మాజీద్ హుస్సేన్, చార్మినార్ నుంచి మాజీ మేయర్ జుల్ఫికర్, యాకత్పురా నుంచి జాఫర్ హుస్సేన్ మిరాజ్ పోటీ చేయనున్నారు. మలక్పేట నుంచి అహ్మద్ బలాల, కార్వాన్ నుంచి కౌసర్ మొయినుద్దీన్ పోటీ చేస్తారని అసదుద్దీన్ తెలిపారు. బహదూర్పూరా, జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోయే అభ్యర్థులను త్వరలోనే ప్రకటిస్తామన్నారు.

ఒకటి రెండు రోజల్లో ప్రచారం ప్రారంభిస్తామని అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు. సిట్టింగ్ ఎమ్మల్యేలైనా పాషా ఖాద్రీ, ముంతాజ్ హేమంత్ ఖాన్ ఈసారి ఎన్నికల బరిలో నిలబడటం లేదని తెలిపారు. తాము పోటీ చేయబోయే ప్రతి స్థానంలో గెలుస్తామని ఆశా భావం వ్యక్తం చేశారు. కాగా, జూబ్లీహిల్స్ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున మాజీ క్రికెటర్ మొహమ్మద్ అజారుద్దీన్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఆయనకు ఎంఐఎం నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది.
ఈ సందర్భంగా అసదుద్దీన్ ఒవైసీ కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు గుప్పించారు. వచ్చే ఏడాది జనవరిలో అయోధ్య మందిర ప్రారంభ కార్యక్రమానికి ప్రధానీ మోడీ వెంట కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని తీసుకెళ్లాలను డిమాండ్ చేశారు. బాబ్రీ మసీదు మొత్తం అంశంలో బీజేపీ, కాంగ్రెస్ల పాత్ర ఉందని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో అనేక సార్లు కర్ఫ్యూ విధించారని మండిపడ్డారు.
1990 నుంచి 2012 వరకు 113 సార్లు కర్ఫ్యూలు విధించారని అసదుద్దీన్ తెలిపారు. కానీ, గడిచిన తొమ్మిదేళ్లలో తెలంగాణలో భైంసా రాత్రి వేళల్లో ఒకసారి.. కోవిడ్లో మరోసారి విధించారని పేర్కొన్నారు. ఇందులోనే తెలుస్తుంది రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులున్నాయని అన్నారు. ప్రజా సమస్యలు తీర్చడంలో ఎంఐఎం ఎప్పుడు ముందుంటుందన్నారు. ఈసారి తప్పకుండా పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాగా, ఎంఐఎం పోటీ చేయని స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీకి మద్దతు పలుకుతున్నట్లు గతంలోనే ఒవైసీ పేర్కొన్న విషయం తెలిసిందే.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications