ప్రేమ బంధం: ఒక్కటైన అమెరికా అమ్మాయి.. ముత్తారం అబ్బాయి
జనగామ జిల్లా పాలకుర్తి మండలం ముత్తారం గ్రామానికి చెందిన కల్వల భాస్కర్రెడ్డి-శీలారెడ్డి దంపతుల కుమారుడు శశికాంత్రెడ్డి 15ఏళ్ల క్రితం అమెరికా వెళ్ళి చదువు పూర్తి చేశాడు.
పాలకుర్తి: దేశాలు వేరు.. భాషలు వేరు.. అయినా మనసులు కలవడంతో మూడుముళ్లతో ఒక్కటయ్యారు. వివరాల్లోకి వెళితే.. జనగామ జిల్లా పాలకుర్తి మండలం ముత్తారం గ్రామానికి చెందిన కల్వల భాస్కర్రెడ్డి-శీలారెడ్డి దంపతుల కుమారుడు శశికాంత్రెడ్డి 15ఏళ్ల క్రితం అమెరికా వెళ్ళి చదువు పూర్తి చేశాడు.
అక్కడే బ్యాక్సర్ మేరీ-అలెన్ దంపతుల కుమార్తె కేటీతో కళాశాలలో పరిచయం ఏర్పడింది. ఒకే సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా శశికాంత్రెడ్డి, కేటీ ప్రేమించుకున్నారు.
పెద్దల అంగీకారంతో ఎల్లలు దాటివచ్చి హిందూ సంప్రదాయం క్రారం ముత్తారంలోని స్వగృహంలో గురువారం శశికాంత్రెడ్డికి కిేతో వివాహం జరిగింది. ఈ వేడుకలకు ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్రావు, మేకలు, గొర్రెల కార్పొరేషన్ చైర్మన్ కన్నెబోయిన రాజయ్య, డీసీసీబీ చైర్మన్ జంగారాఘవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎన్. సుధాకర్రావు, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య హాజరై వధూవరులను ఆశీర్వదించారు.