Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

3న బీజేపీ జెండా ఎగరాలి: మోడీ అలా.. కేసీఆర్ ఇలా అంటూ అమిత్ షా

ఆదిలాబాద్: డిసెంబర్ 3న హైదరాబాద్‌లో బీజేపీ జెండా ఎగరాలని.. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కారు రావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఆదిలాబాద్‌లో మంగళవారం నిర్వహించిన బీజేపీ జనగర్జన సభలో ఆయన పాల్గొన్నారు. కుమురంభీంను స్మరించుకుంటూ ప్రసంగం ప్రారంభించిన అమిత్ షా.. పవిత్ర భూమి ఆదిలాబాద్ రావడం సంతోషంగా ఉందన్నారు.

మోడీ నేతృత్వంలో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడతుందన్నారు అమిత్ షా. కేసీఆర్ వైఖరి కారణంగా గిరిజన వర్సిటీ ఏర్పాటు ఆలస్యమైందన్నారు. గిరిజన వర్సిటీకి కేసీఆర్ సర్కారు స్థలం చూపించలేదని.. అందుకే ఆలస్యమైందని చెప్పారు. మోడీ.. కృష్ణా ట్రైబ్యునల్ నిబంధనలు మార్చి తెలంగాణకు నీటి ఇబ్బంది లేకుండా చేశారన్నారు. పదేళ్లుగా కేసీఆర్ తెలంగాణ పేదల సమస్యలు తీర్చలేదన్నారు.

Amit shah hits out at kcr govt in adilabad

రైతులు, దళితులు, గిరిజనులను కేసీఆర్ పట్టించుకోలేదని అమిత్ షా మండిపడ్డారు. మోడీ ప్రభుత్వం చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించిందని అమిత్ తెలిపారు. ప్రతి పేద మహిళకు మోడీ వంటగ్యాస్ ఇచ్చారని.. రైతుల ఖాతాల్లో ఏటా రూ. 6వేలు జమ చేస్తున్నారని చెప్పారు. ఒడిశాలో పుట్టిన నిరుపేద గిరిజన మహిళను మోడీ.. రాష్ట్రపతిని చేశారని అమిత్ షా తెలిపారు.

అయోధ్యలో రామమందిరం కట్టాలా? వద్దా? చెప్పండి? అడ్డంకులను అధిగమించి మోడీ సర్కారు రామమందిరం నిర్మిస్తోంది. ఆర్టికల్ 370 ఎత్తివేసి కాశ్మీర్‌కు విముక్తి కల్పించిందన్నారు అమిత్ షా. సర్జికల్ స్ట్రైక్స్ చేసి శత్రువులను తరిమికొట్టిందన్నారు. తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ చేశానని కేసీఆర్ చెబుతుంటారు.. రైతులు ఆత్మహత్యల విషయంలో, అవినీతి విషయంలో తెలంగాణను నెంబర్ చేశారని అమిత్ షా విమర్శించారు.

కాంగ్రెస్ పేదల గురించి మాట్లాడుతుంది కానీ.. పేదల కోసం ఏమీ చేయదని విమర్శించారు అమిత్ షా. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కోసం చేసిందేమీ లేదన్నారు. ఎన్నికలు రాగానే కాంగ్రెస్ వాళ్లకు పేదలు గుర్తుకు వస్తారన్నారు. తొమ్మిదేళ్లుగా మోడీ సర్కారుపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవన్నారు. కేసీఆర్ గిరిజనుల కోసం ఎన్నో హామీలిచ్చారు కానీ.. అమలు చేయలేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ గెలిస్తే కేటీఆర్ సీఎం అవుతారని.. బీజేపీ వస్తే ఆదిబాసీ బిడ్డలకు కొలువులు వస్తాయన్నారు.

కేసీఆర్.. ఆదివాసీలకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామన్నారు? ఇచ్చారా? అని అమిత్ షా ప్రశ్నించారు. దళితులు, గిరిజనుల కోసం మోడీ తొమ్మిదేళ్లుగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని అమిత్ షా తెలిపారు. కేసీఆర్ మాత్రం పదేళ్లుగా తన కుటుంబం గురించే ఆలోచిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ కారు స్టీరింగ్ ఒవైసీ చేతిలో ఉందన్నారు. మజ్లిస్ కనుసన్నల్లో నడిచే బీఆర్ఎస్ ను పీకి పారేసి.. మోడీ నేతృత్వంలోని బీజేపీకి పట్టం కట్టాలని ప్రజలకు అమిత్ షా పిలుపునిచ్చారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+