తెలంగాణలో సీఏఏ రగడ .. కేసీఆర్ , ఓవైసీ టార్గెట్ గా అమిత్ షా సభ
Recommended Video

త్వరలో బీజేపీలో కీలక నేత అమిత్ షా తెలంగాణలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. సీఎం కేసీఆర్, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీలను టార్గెట్ చేసి బీజేపీ ఈ సభ నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. కేంద్ర సర్కార్ లో బీజేపీలో కీలక నేతగా భావిస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్షా మార్చి నెల 15వతేదీన హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో బహిరంగ సభలో మాట్లాడనున్నారు.
తెలంగాణాలో అమిత్ షా పర్యటన సందర్భంగా ఆయన ఏం వ్యాఖ్యలు చేస్తారు అన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తెలంగాణా రాష్ట్రంలో సీఏఏ పై అవగాహన కల్పించటం కోసం బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించింది. ఓవైపు కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన సీఏఏకు వ్యతిరేకంగా దేశ్యాప్తంగా ఆందోళన కొనసాగుతుండగా.. హైదరాబాద్లోనూ నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఇక ఏకంగా టీఆర్ఎస్ పార్టీ క్యాబినెట్ లో సీఏఏ కు వ్యతిరేకంగా తీర్మానం చేసింది .

ఇక ఇదే సమయంలో.. భారతీయ జనతా పార్టీ.. సీఏఏకు అనుకూలంగా సభలు నిర్వహిస్తోంది. ఇక ఎప్పుడు రాష్ట్రానికి అమిత్ షా వచ్చి వెళ్ళినా హాట్ హాట్ గా చర్చ జరుగుతుంది. ఎప్పుడు రాష్ట్రానికి వచ్చినా.. ఏదో హాట్ కామెంట్ చేసే వెళ్లే అమిత్షా ఈ సారి ఏం మాట్లాడతారనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. సీఎం కేసీఆర్ ను, అలాగే ఓవైసీ ని పక్కాగా టార్గెట్ చేసి మాట్లాడతారనే చర్చ జరుగుతుంది. మరోవైపు సీఏఏకు వ్యతిరేకంగా తెలంగాణ కేబినెట్ తీర్మానం కూడా చేయడంతో టీఆర్ఎస్ సర్కార్ను టార్గెట్ చేస్తూనే ఆయన సభలో ప్రసంగిస్తారని భావిస్తున్నారు. ఏది ఏమైనా అమిత్ షా పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది .
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక












Click it and Unblock the Notifications