తెలంగాణాలో ఆ ఆలయ అభివృద్ధి పనుల భూమిపూజకు ఏపీ డిప్యూటీ సీఎం!
ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జనవరి 3వ తేదీన తెలంగాణ రాష్ట్రంలోని సుప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించనున్నారు ఈ మేరకు ఆయన పర్యటన షెడ్యూల్ ఖరారు అయింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అంతేకాదు ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానం 35.19 కోట్ల నిధులతో చేపట్టనున్న ఆలయ అభివృద్ధి పనులకు భూమిపూజ చేస్తారు.
కొండగట్టు అభివృద్ధి పనులకు పవన్ కళ్యాణ్ భూమి పూజ
పవిత్రమైన మార్గశిర పౌర్ణమి రోజున ఈ అభివృద్ధిపనులు పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ప్రారంభం కానున్నాయి .ఈ నిధులతో 100గదుల అత్యాధునిక ధర్మశాల నిర్మాణం, అలాగే 2,000మంది భక్తులు ఒకేసారి హనుమాన్ దీక్ష విరమించే భారీ మండపం నిర్మాణం చేయనున్నారు. సుదూర ప్రాంతాల భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక వసతి గృహాలు కూడా ఈ ప్రణాళికలో నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టులు ఆలయ మౌలికవసతులను, భక్తుల సౌకర్యాలను మెరుగుపరచడం లక్ష్యంగా ఉన్నాయి.

కొండగట్టు ఆలయానికి పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక అనుబంధం
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంతో పవన్ కళ్యాణ్ కు చాలా ప్రత్యేక అనుబంధం ఉంది. గతంలో వారాహి వాహనం ఎన్నికల ప్రచార రథం పూజ కూడా కొండగట్టు ఆంజనేయ స్వామీ ఆలయంలో చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఎన్డీఏ కూటమి పార్టీలతో పొత్తును ఆయన ఇదే ఆలయం నుంచి ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో కూటమి భారీ విజయం సాధించిన తరుణంలో కూడా పవన్ కళ్యాణ్ కొండగట్టును సందర్శించడం విశేషం.
పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాటకు కట్టుబడి టీటీడీ నిధులు
ఈ పర్యటనకు రాజకీయంగా, ఆధ్యాత్మికంగా రెండింటికీ ఎంతో ప్రాధాన్యం ఉంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టు అంజన్న ఆలయానికి సంబంధించి పవన్ కల్యాణ్ రాకతో భక్తులు, ఆయన అభిమానులు భారీగా తరలి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి తన వంతు సాయం చేస్తానని మాటిచ్చిన పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాటకు కట్టుబడి టీటీడీ నిధులను ఇచ్చేలా చేశారు.
-
వాళ్లను వదలొద్దు- రఘురామ, పవన్ కళ్యాణ్ డిమాండ్..! -
రాములవారి సేవలో శ్రీవారి సేవకులు, అరుదైన ఘట్టం - కన్నుల పండువగా..!! -
డోర్నకల్–గద్వాల్ కొత్త రైల్వే లైన్ తో పాటు రైల్వే ప్రాజెక్ట్ లపై కేంద్రం శుభవార్త! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
రూ.300 టికెట్లు లేకపోయినా శ్రీవారి దర్శనం- భక్తుల కోసం టీటీడీ కొత్త విధానం...!! -
తమిళనాడులో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం.. విజయ్ కు బిగ్ షాక్..? -
నెలకు రూ.80,500 జీతంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండానే !! -
చిరంజీవి, నాగబాబు గురించి పవన్ భార్య "అన్నా" సంచలన పోస్ట్..! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!!












Click it and Unblock the Notifications