తెలంగాణ పుణ్యమా అని ఆంధ్రా అభివృద్ధి: కెటిఆర్, ప్రభుత్వ కాలేజీల్లో ఉచిత విద్య

హైదరాబాద్: ఏపీలో అభివృద్ధి జరుగుతోందంటే అదంతా తెలంగాణ పుణ్యమేనని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు విడిపోకుండా ఉంటే అభివృద్ధి చెందేవా? అని ప్రశ్నించారు. విభజన వల్ల అటు ఆంధ్రాలో ఇటు తెలంగాణలో అభివృద్ధి జరుగుతోందన్నారు.

ఓ రకంగా ఆంధ్రాలో అభివృద్ధికి తెలంగాణయే కారణమన్నారు. ఆంధ్రాలో ఇవాళ గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం రావడానికి, ఐఐటీ, ఐఐఎంలు వచ్చాయనడానికి తెలంగాణ, ఆంధ్రా రెండుగా విడిపోవడమే కారణమన్నారు.

ఉప్పల్ నియోజకవర్గం కార్యకర్తల సమావేశాన్ని మల్లాపూర్‌లోని వీఎన్‌ఆర్ గార్డెన్‌లో ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి మహేందర్ రెడ్డి, మంత్రి కెటిఆర్ తదితర నేతలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు.

AP is developing due to Telangana state: KTR

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గ్రాఫ్ క్రమంగా పడిపోతోందని ఉప ముఖ్యమంత్రి సీఎం కడియం శ్రీహరి అన్నారు. మోడీకి రానురాను ప్రజల్లో ఆదరణ తగ్గిపోతోందన్నారు. మోడీ ప్రధాని కాగానే మొదట ఢిల్లీలో ప్రజలు ఓడించారని, ఆ తర్వాత బీహార్లో ఓడారన్నారు.

తెలంగాణలో ప్రభుత్వ కళాశాలల్లో విద్య ఉచితం

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఉచిత విద్యుత్ అమలు చేయనున్నారు. ఈ ఏడాది నుంచి అమలు చేయనున్నట్లు ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాష్ట్రంలో 402 కళాశాలల్లో 1,15,111 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో 80 శాతం మంది బిసి, ఎస్సీ, ఎస్టీలు ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+