వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కంచ ఐలయ్యను అరెస్ట్ చేయకుంటే: ఆర్య వైశ్య సంఘం

వైశ్యులపై వివాదాస్పద పుస్తకం రాసిన కంచ ఐలయ్యపై ఆర్య వైశ్యుల హక్కుల సాధన సమితి ఏపీ అధ్యక్షులు టిజి భరత్ సోమవారం ఫిర్యాదు చేశారు.

|
Google Oneindia TeluguNews

కర్నూలు/హైదరాబాద్: వైశ్యులపై వివాదాస్పద పుస్తకం రాసిన కంచ ఐలయ్యపై ఆర్య వైశ్యుల హక్కుల సాధన సమితి ఏపీ అధ్యక్షులు టిజి భరత్ సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పుస్తకం నిషేధించాలి

పుస్తకం నిషేధించాలి

ఈ సందర్భంగా టిజి భరత్ మాట్లాడారు. ఆర్య వైశ్యులపై రాసిన పుస్తకాన్ని ప్రభుత్వం వెంటనే నిషేధించాలని డిమాండ్ చేశారు. కంచ ఐలయ్యను అరెస్టు చేయకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

చర్చకు ఏక్కడైనా సిద్ధం

చర్చకు ఏక్కడైనా సిద్ధం

కంచ ఐలయ్య రాసిన పుస్తకంపై తాము ఎక్కడైనా చర్చకు సిద్ధమని ఆర్య వైశ్య సంఘం ప్రకటించింది. ఈ విషయమై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఈ పుస్తకాన్ని వెంటనే నిషేధించాలని డిమాండ్ చేశారు.

చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్

చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్

ఐలయ్యపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆర్య వైశ్య సంఘం డిమాండ్ చేసింది. ఐలయ్య పుస్తకంలోని అవాస్తవాలపై ఎలాంటి చర్చకైనా తాము సిద్ధమని తెలిపింది. ఆర్యవైశ్యులకు ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలన్నారు.

పుస్తకంపై విమర్శలు

పుస్తకంపై విమర్శలు

కంచ ఐలయ్య పుస్తకం సమాజ విచ్ఛిన్నానికి కారణం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, వైశ్యులపై కంచ ఐలయ్య వివాదాస్పద పుస్తకం రాశారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఆర్య వైశ్య సంఘం మాత్రం తగ్గడం లేదు.

English summary
Protests and rallies by Arya Vysya Sangam erupted in the Telugu States demanding ban on the book ‘Samajika Smugglers-Komatollu’ (Arya Vysyas are societal smugglers), penned by Kancha Ilaiah.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X