Kamareddy News: కామారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం.. లారీ కిందికి దూసుకెళ్లిన ఆటో.. ఆరుగు మృతి..
అతివేగం ఎప్పటికీ ప్రమాదకరమే.. ఇలా అతివేగంతో ఓ ఆటో కంటైనర్ లారీ కిందికి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆరుగు మృతి చెందారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది. జిల్లాలోని మద్నూరు మండలం మేనూరులోని జాతీయ రహదారిపై కంటైనర్ లారీ కిందకు ఆటో దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
గుజరాత్ వెళ్తోన్న లారీ..
కంటైనర్ లారీ హైదరాబాద్ నుంచి గుజరాత్ వెళ్తోన్న క్రమంలో ఆటో మద్నూర్ నుంచి బిచ్కుంద వైపు రాంగ్రూట్లో వస్తోంది. వేగంగా వస్తున్న ఆటో అదుపుతప్పి ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీ కిందకు దూసుకెళ్లింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న వారిలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు.

రాంగ్ రూట్
కంటైనర్ లారీ డ్రైవర్, క్లీనర్కు తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే ఆటోలో ప్రయాణిస్తున్న వారు వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.












Click it and Unblock the Notifications