ప్రజల కన్నా ప్రాజెక్టులే మిన్న.. కేసీఆర్పై దత్తన్న ఫైర్
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్-బీజేపీ మధ్య మాటల యుద్ధం ముదురుతుంది. సీఎం కేసీఆర్ లక్ష్యంగా బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని మండిపడుతున్నారు. తాజాగా కేసీఆర్పై బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ ఫైరయ్యారు. కేసీఆర్కు ప్రజల కన్నా .. ప్రాజెక్టులే మిన్న అని మండిపడ్డారు.
నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ. రాష్ట్రానికి ప్రాజెక్టులు అవసరమేనని అభిప్రాయపడ్డారు. కానీ ముందు ప్రజలు అని గుర్తుచేశారు. కేసీఆర్ ప్రజలను మరచి కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారని విమర్శించారు. ఎప్పుడు ప్రాజెక్టుల పేరుతో కాలం వెళ్లదీస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అవినీతి పేరుకుపోయిందని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తోన్న నిధులను కూడా సక్రమంగా వినియోగించడం లేదని విమర్శించారు.

ఇటు కాంగ్రెస్ పార్టీని కూడా ఏకీపారేశారు. కాంగ్రెస్ పార్టీ మునిగిపోతున్న నావ లాంటిదని విమర్శించారు. ఆ పార్టీ బలహీనత బలమైన నాయకత్వం లేకపోవడమేనన్నారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినంగా ప్రకటించాలని కేసీఆర్ను డిమాండ్ చేశారు. విమోచన దినం ఎందుకు జరపడం లేదని కేసీఆర్ను ప్రశ్నిస్తున్నారు.
-
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications