ఇక కాళేశ్వరం ఇష్యూ.. ప్రాజెక్ట్ విజిట్ చేస్తాం, పర్మిషన్ ఇవ్వండి, సీఎస్కు బండి సంజయ్ లేఖ
జనాలతో బండి సంజయ్ మమేకం అవుతున్నారు. ప్రజా సంగ్రామ యాత్ర మూడు విడతలుగా జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన.. అంతకుముందు సభలు, సమావేశాలు.. చేరికల సందర్భంగా బహిరంగ సభలు నిర్వహిస్తోంది. జేపీ నడ్డా, అమిత్ షా లాంటి అగ్ర నేతలు తెలంగాణ రాష్ట్రానికి వచ్చి తమ పార్టీ బలోపేతం గురించి కార్యాచరణ రూపొందిస్తున్నారు.
Recommended Video

జనంలో బండి సంజయ్..
ఇక బండి సంజయ్ కూడా అంతే.. ఇప్పటికే ప్రజా సంగ్రామ యాత్రను మూడు విడతలుగా చేశారు. ఆ తర్వాత జనంతో దగ్గరవ్వడం.. సమస్యలపై పోరాటం చేస్తున్నారు. ఇటీవల చేరికల సందర్భంగా బహిరంగ సభలు.. అగ్ర నేతల రాకతో బీజేపీలో జోష్ నింపింది. ఇప్పుడు బండి సంజయ్ కొత్తగా మరో ఇష్యూను ముందట వేసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శిస్తామని చెబుతున్నారు. అందులో భారీగా అవినీతి జరిగిందిన బీజేపీ ఆరోపించిన సంగతి తెలిసిందే.

ప్లీజ్.. పర్మిషన్ ఇవ్వండి
కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శించేందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్కు బండి సంజయ్ లేఖ రాశారు. తమ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ప్రజా ప్రతినిధులు, సాగునీటి పారుదల రంగం నిపుణులతో కూడిన 30 మంది ప్రతినిధి బృందం ప్రాజెక్టు విజిట్ చేస్తామని తెలిపారు. సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో వెళ్లాలని అనుకుంటున్నామని లేఖలో ప్రస్తావించారు.

పరిశీలన
కాశేళ్వరం ప్రాజెక్టు నిర్మాణం, వరదల్లో ప్రాజెక్టు మునకపై పరిశీలిస్తామని సంజయ్ తెలిపారు. దీంతో ప్రాజెక్టుపై తమకు ఉన్న అనుమానాలను నివృత్తి చేసుకుంటామని పేర్కొన్నారు. 1998లో వచ్చిన వరదల వల్ల శ్రీశైలం ప్రాజెక్టు టర్బైన్లు దెబ్బ తినడంతో వాటిని పరిశీలించేందుకు అప్పటి ప్రభుత్వం విపక్షాలకు అనుమతి ఇచ్చిన విషయాన్ని బండి సంజయ్ గుర్తు చేశారు. తమ బృందంతోపాటు ప్రభుత్వ సాగునీటి శాఖ అధికారులను పంపి తమ అనుమానాలను నివృత్తి చేయాలని సీఎస్ను కోరారు.
-
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !!












Click it and Unblock the Notifications