గోంతుకోసుకుంటానని, రాజకీయ లింకు కోసుకుండు !
రాజకీయాల్లోకి ఎంతో మంది వస్తారు,వెళతారు, రాజకీయాలు అనేవి ఓ నదిలాంటిది కోత్త నీరు వస్తుంది,పాత నీరు పోతుంది, ఇందులో బాగంగానే కొద్దిమంది అతి కొద్దికాలమే రాజకీయాల్లో ఉంటారు ,ఆ సమయంలోనే సంచనాలు సృష్టిస్తారు, అనంతరం రాజకీయాల నుండే శాశ్వతంగా తప్పుకుంటారు. ఇలాంటీ కోవకే చెందిన వ్యక్తి బండ్ల గణేష్,
బండ్లగణేష్, ఒకవైపు పవన్ కళ్యాణ్ అభిమానిగా మరోవైపు తెలంగాణ రాజకీయాల్లోకి చేరిన వ్యక్తి గా అందరికి పరిచయమే , ఆయన గత అసెంబ్లి ఎన్నికల్లో ఓ వెలుగు వెలిగాడు కూడ , రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆయన చేరిన కాంగ్రెస్ పార్టీలో సంచలన వ్యాఖ్యలే చేశారు.
కాంగ్రెస్ గెలవకపోతే గోంతు కోసుకుంటాను , బండ్ల గణేష్
కాంగ్రెస్ పార్టీలో చేరిన బండ్ల గణేష్ ఆ పార్టీ తరఫున ప్రచారం కూడ చేశాడు, దీంతో ఆపార్టీ గెలపుపై దీమా వ్యక్తం చేశాడు. ఈనేపథ్యంలోనే ఓ చానల్ కు ఇచ్చిన ఇంటర్యూలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని బల్లగుద్ది చెప్పాడు .ఒక వేళ అధికారంలోకి రాకపోతే తాను గోంతు కోసుకుంటానని ప్రకటించాడు.
ఈ విషయంలో ఆయన్ను వెంటాడిన ఓ చానల్,
కాగా గణేష్ చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ ఫలితాలు సాధించకపోగా, పూర్తిగా డీలా పడింది. దీంతో గోంతుకోసుకుంటానన్న బండ్ల గణేష్ సైతం డీలాపడ్డారు. దీంతో సంచలన వ్యాఖ్యలు చేసిన బండ్ల గణేష్ ను ఎన్నికల ఫలితాల తర్వాత ఇంటర్యూ చేసిన చానల్ ఆయన గోంతు కోసుకుంటానన్నాడని ఆయన ఇంటి ముందే కూర్చుంది.దీంతో ఆయన్ను మూడు నాలుగు రోజుల పాటు మరి వెంబడించింది ,దీంతో ఆయన దిగివచ్చి క్షమాపణ చెప్పాల్సి వచ్చింది.
రాజకీయలకు దూరంగా ఉంటానని ప్రకటించిన గణేష్,
ఇక కోద్ది కాలమే కాలమే కాంగ్రెస్ పార్టీలో ఉన్న బండ్ల పార్టీలో కొనసాగలేనని ,పూర్తిగా తాను రాజకీయాల నుండి తప్పుకుంటానని ప్రకటించారు. కాగా అతికోద్ది కాలంలోనే రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన బండ్ల ఇక ప్రజలకు దూరంగా ఉండడం కోంత ఆయన అభిమానులను నిరాశకు గురిచేయనుంది.