మరీ ఇంత ఘోరమా? రొట్టెల పిండి పడేసిందని.. కూతురిపై కిరోసిన్ పోసి..
కన్న కూతురిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తల్లే కిరాతకురాలిగా మారింది. చిన్నపిల్ల అని కూడా చూడకుండా కిరోసిన్ మీద పోసి నిప్పంటించింది.
షాద్ నగర్: కన్న కూతురిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తల్లే కిరాతకురాలిగా మారింది. కాస్త రొట్టెల పిండి కింద పడేసిందని కోపం పట్టలేక చిన్నపిల్ల అని కూడా చూడకుండా కిరోసిన్ మీద పోసి నిప్పంటించింది.
ఈ దారుణమైన ఘటన రంగారెడ్డి జిల్లా ఫరూఖ్ నగర్ మండలం చింతగూడ గ్రామంలో జరిగింది. చింతగూడకు చెందిన చెన్నయ్య, దొబ్బ స్వరూప దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు.
రోజూ మాదిరిగానే రాత్రి రొట్టెలు చేసేందుకు పిండి తీసుకురమ్మని స్వరూప తన కూతురు రాధిక(10)ను కిరాణా షాపుకు పంపింది. పాపం, ఆ పిల్ల పిండి తెస్తుండగా అనుకోకుండా కొంత పిండి కింద పడిపోయింది.

ఇది తెలియగానే స్వరూప అగ్గి మీద గుగ్గిలమే అయింది. కూతుర్ని చితకబాదింది. అంతటితో ఊరుకోకుండా ఇంట్లోకి వెళ్ళి కిరోసిన్ తీసుకొచ్చి చిన్నపిల్ల అని కూడా చూసుకోకుండా రాధికపై పోసి నిప్పటించింది.
ఇది గమనించిన స్థానికులు పరుగుపరుగున వచ్చి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. వెంటనే 108 అంబులెన్స్ కు కాల్ చేసి, తీవ్రంగా కాలిన గాయాలతో ఉన్న ఆ చిన్నారిని షాద్ నగర్ లోని ప్రభుత్వ ఆసుప్రతికి తరలించారు. కానీ రాధిక పరిస్థితి విషమంగా మారడంతో అక్కడ్నించి హైదరాబాద్ లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications