బీజేపీ నేతపై హత్యాయత్నం కేసులో బిగ్ ట్విస్ట్: తనపై తానే దాడి, ఎందుకో తెలుసా?
హైదరాబాద్: బీజేపీ నాయకుడు ఉదయ్ భాస్కర్ గౌడ్పై హత్యాయత్నం కేసు మరో మలుపు తిరిగింది. కేసు విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి తెచ్చారు పోలీసులు. రాజకీయాల్లోకి వచ్చిన ఉదయ్ భాస్కర్.. గతంలో తనపై క్రిమినల్ కేసులు ఉండటంతో గన్మెన్ల కోసం తన మీద తానే హత్యాయత్నం చేసుకున్నాడు.
ఆ తర్వాత తనపై దాడి జరిగిందంటూ ఉప్పల్ పోలీస్ స్టేషన్లో చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసి విచారణ జరిపిన పోలీసులు అసలు విషయం తేల్చారు. నిందితుడు ఉదయ్ భాస్కర్ గౌడ్ తోపాటు మరో ఆరుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు మల్కాజిగిరి డీసీపీ పద్మజ తెలిపారు.

డీసీపీ తెలిపిన వివరాల ప్రకారం.. భాస్కర్ గౌడ్ బోడుప్పల్లో నివాసం ఉంటున్నాడు. పలుకుబడి కోసం మర్డర్ ప్లాన్ చేయించుకున్నాడు. గన్మెన్లు ఉంటే సమాజం గౌరవిస్తుందన్న దురుద్దేశంతో ఈ ప్లాన్ వేశాడు. ఫిబ్రవరి 24న ఉప్పల్ భగాయత్లో ఈ దాడి ఘటన చోటు చేసుకుంది. ఇందుకోసం రూ. 2.50 లక్షలతో ఒప్పందం కుదుర్చుకున్నాడు.
కాగా, ఉదయ్ భాస్కర్ పై హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లో ఏడు కేసులు నమోదయ్యాయి. మర్డర్ ప్లాన్ కు సహకరించిన ఆరుగురిని అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించామని, మరో ఇద్దరు పరారీలో ఉన్నారని డీసీపీ పద్మజ తెలిపారు.
-
ఉచిత బస్సు ప్రయాణం చేసేవారికి ఆర్టీసీ మరో శుభవార్త! -
మూడు ముళ్లు బంధంతో ఒక్కటైన "అల్లు శిరీష్ - నైనికా"..! -
సీఎం పదవికి రాజీనామా! బీహార్ తదుపరి ముఖ్యమంత్రి ఎవరు? -
హైదరాబాద్ కు తలమానికంగా మరో రైల్వే స్టేషన్ రెడీ అన్న కేంద్రమంత్రి -
"హైదరాబాద్"లో నీటి సరఫరా బంద్.. ఎప్పుడు ? ఎక్కడెక్కడంటే ? ? -
మాటలతో, మూటలతో ఎన్నికల్లో గెలిచేవాళ్లం కాదు - సీఎం రేవంత్ రెడ్డి -
హైదరాబాదీ మటన్ దాల్చా.. ఇలా చేస్తే మళ్ళీ మళ్ళీ కావాలంటారు! -
హైదరాబాద్ లో ఆ ఫ్లైఓవర్ సంగతి తేల్చండి.. !! -
ఆశలు ఆవిరి చేస్తోన్న బంగారం ధరలు -
ఏపీలో వాహనదారులకు భారీ షాక్-అసెంబ్లీలో బిల్లు..! -
Todays Horoscope: ఈ రాశి వారికి ఆరోగ్య సమస్యలు- ఆ రాశి వారికి ధన లాభాలు..!! -
అనసూయకు అవమానం..? వీడియో












Click it and Unblock the Notifications