బయో టాయిలెట్స్.. త్వరలో తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల కోసం..
సమ్మె విరమణ తర్వాత తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద పెట్టింది. ఆర్టీసీ కార్పోరేషన్ ద్వారా ఉద్యోగుల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తోంది. ఇందులో భాగంగా కార్మికుల ఉద్యోగ విరమణను 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచిన ప్రభుత్వం.. ఇప్పుడు వారి వ్యక్తిగత సమస్యలపై కూడా దృష్టి పెట్టింది. తాజాగా ఆర్టీసీ కార్మికుల కోసం సంచార బయో టాయిలెట్లను ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ఆర్టీసీ సిద్ధమైంది.
విధి నిర్వహణలో ఆర్టీసీ డ్రైవర్లు,కండక్టర్లు టాయిలెట్ సదుపాయం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మహిళా ఉద్యోగులు చెప్పలేని బాధలు అనుభవిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ యాజమాన్యం చేంజ్ ఓవర్ పాయింట్స్లో బయో టాయిలెట్స్ ఏర్పాటు చేయనుంది. నగరంలో మొత్తం 9 చేంజ్ ఓవర్ పాయింట్స్లో వీటిని ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం.













Click it and Unblock the Notifications