ఎన్నికల వేళ రాజాసింగ్ కు బిగ్ రిలీఫ్ - పోటీకి లైన్ క్లియర్..!!
తెలంగాణ ఎన్నికల వేళ బీజేపీ వరుస నిర్ణయాలు తీసుకుంటోంది. బీజేపీ అభ్యర్దుల ఎంపిక పైన సుదీర్ఘ కసరత్తు చేస్తున్న పార్టీ నాయకత్వం ఈ రోజు తొలి జాబితా విడుదలకు సిద్దమవుతోంది. ఇప్పటికే అభ్యర్దులకు పార్టీ నేతలు ఫోన్ చేసి సీటు ఖరారు అయిన అంశం చెబుతున్నారు. ఇప్పటి వరకు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు తిరిగి పోటీ చేసేందుకు అవకాశం వస్తుందా లేదా అనే చర్చ నేపథ్యంలో బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది.
సస్పెన్షన్ ఎత్తివేత: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పైన బీజేపీ నాయకత్వం సస్పెన్షన్ ఎత్తివేసింది. గత ఏడాది వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో రాజాసింగ్ పైన పార్టీ సస్పెన్షన్ విధించింది. ఆ వ్యాఖ్యల కేసులో కేసు నమోదు కావటంతో రాజాసింగ్ జైలుకు వెళ్లారు. ఆ తరువాత రాజాసింగ్ పైన పార్టీ సస్పెన్షన్ ఎత్తివేత అంశం పైన పలు సందర్భాల్లో చర్చ సాగింది.

రాజాసింగ్ ఆ వ్యాఖ్యల పైన పార్టీ నేతలకు వివరణ ఇచ్చారు. సస్పెన్షన్ ఎత్తివేయాలని కోరుతూ రాజాసింగ్ సతీమణి పార్టీ నేతలకు లేఖలు రాసారు. ఇక, ఇప్పుడు ఎన్నికల సమయంలో పార్టీ సస్పెన్షన్ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. 2018 ఎన్నికల్లో రాజాసింగ్ ఒక్కరే బీజేపీ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.2014, 2018 ఎన్నికల్లో వరుసగా రెండు సార్లు రాజాసింగ్ ఎమ్మెల్యేగా గెలుపొందారు.
గోషామహల్ నుంచి పోటీ: ఇప్పుడు సస్పెన్షన్ ఎత్తివేయటంతో రాజాసింగ్ మరోసారి గోషామహల్ నుంచి పోటీకి లైన్ క్లియర్ అయింది. ఈ రోజు పార్టీ ప్రకటించే తొలి జాబితాలోనే రాజాసింగ్ పేరు ఖాయమని తెలుస్తోంది. రాజాసింగ్ పైన సస్పెన్షన్ ఎత్తివేయకంటే విక్రమ్ గౌడ్ పార్టీ అభ్యర్దిగా బరిలో ఉంటారని భావించారు. ఇక, ఇప్పుడు రాజాసింగ్ పార్టీ అభ్యర్దిగా బరిలో నిలవనున్నారు. ఇక.. బీజేపీ తొలి జాబితా విడుదలపై సందిగ్ధత కొనసాగుతోంది.
మొదటి జాబితాపై ముఖ్యనేతల మధ్య ఏకాభిప్రాయం కుదరనట్లు తెలియవచ్చింది. కీలక నేతలు అలకపూనడంతో మొదటి జాబితా విడుదల ఆగినట్లు సమాచారం.తమకు కేటాయించిన నియోజకవర్గాలను పలువురు సీనియర్లు మర్చమంటున్నారు. దీంతో కీలకనేతలు అడిగిన స్థానాలను అధిష్టానం పెండింగ్లో పెట్టింది. ఈ క్రమంలో ఆఖరిక్షణంలో మొదటి జాబితా విడుదల నిలిచిపోయింది.

తొలి జాబితా సిద్దం: సీనియర్లను ఇంచార్జ్లు జవడేకర్, సునీల్ బన్సల్ బుజ్జిగిస్తున్నారు. అభ్యంతరం లేని నియోజకవర్గ నేతలకు నేరుగా ఫోన్లు చేసి టికెట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. సీనియర్లు దారికొస్తే.. ఏ క్షణమైనా బీజేపీ ఫస్ట్ లిస్ట్ విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అటు జనసేనతోనూ పొత్తు ఖాయమైనట్లు సమాచారం. పార్టీ ఈ పొత్తు విషయాన్ని అధికారికంగా నిర్దారించాల్సి ఉంది.
జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తారనేది ఇప్పుడు స్పష్టత రావాల్సి ఉంది. హైదరాబాద్ నగరంతో పాటుగా ఖమ్మం జిల్లాలో జనసేనకు సీట్లు ఇస్తారని చెబుతున్నారు. జనసేనతో పొత్తు..సీట్ల వ్యవహారంతో పాటుగా పార్టీ అభ్యర్దుల తొలి జాబితా ఈ రోజు బీజేపీ అధికారికంగా ప్రకటించేందుకు కసరత్తు జరుగుతోంది.
-
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..!












Click it and Unblock the Notifications