బిడిఎల్లో పేలుడు: 5గురికి తీవ్రగాయాలు, ముగ్గురి పరిస్థితి విషమం
హైదరాబాద్: నగరంలోని కంచన్బాగ్లోని బీడీఎల్(భారత్ డైనమిక్ లిమిటెడ్)లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురికి తీవ్ర గాయాలయాయి. క్షతగాత్రులను అపోలో ఆసుపత్రికి తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.

బిడిఎల్లో శనివారం ఉదయం 10గంటల ప్రాంతంలో వ్యర్థాలను తగలబెడుతుండగా అందులోని మెటీరియల్ పేలడంతో భారీ ప్రమదం సంభవించింది. అక్కడేవున్న ఐదుగురు సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు.

నెలకోసారి ఇలా వ్యర్థాలను తగలబెడతారని, తరచూ ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటాయని స్థానికులు చెబుతున్నారు. బిడిఎల్లో ఇటీవల సంభవించిన పేలుడు ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే.

కాగా, కాంచన్బాగ్లోని బిడిఎల్లో సంభవించిన విస్ఫోటనంలో గాయపడిన బాధితులను తెలంగాణ ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ కొద్దిసేపటి క్రితం పరామర్శించారు.

ఆటో బోల్తా: ముగ్గురు మహిళలు మృతి
మహబూబ్నగర్ జిల్లాలోని లింగాల మండలం దత్తారం దగ్గర ఓ ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు మృతి చెందారు. వీరంతా పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.












Click it and Unblock the Notifications