మగాడిలా మాయమై మగువలా తిరిగి ప్రత్యక్షం

పోలీసుల కథనం ప్రకారం - ఎల్లారెడ్డి మండలంలోని వీర్నపల్లి తండాకు చెందిన లకావత్ రాంచంద్రం - శకుంతల దంపతులకు ముగ్గురు కొడుకులు వీరిలో రెండవ కుమారుడు సురేశ్ ప్రవర్తన చిన్నతనం నుంచే అమ్మాయిలా ఉండేది. కొంతకాలం క్రితం తల్లిదండ్రులు ఓ హత్య కేసులో జైలుకు వెళ్ళడంతో సురేశ్ తన సోదరుడు రాజు వద్దే ఉన్నాడు. అదే సమయంలోనే రాజు సోదరుడు సురేశ్కు ఇష్టం లేకున్నా మండలంలోని గుండారం గ్రామానికి చెందిన ఓ యువతితో వివాహం జరిపించారు.
సురేశ్ను తన ప్రవర్తన మార్చుకోమంటూ తరచూ తన సోదరుడు తనను తన భార్య ముందే కొట్టడం, తిట్టడం చేస్తుంటే సురేశ్ దంపతుల మధ్య విభేధాలు వచ్చాయి. దీంతో కొద్ది రోజులు సురేష్ భార్య తన పుట్టింటికి వెళ్ళిపోయింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన సురేష్ నిరుడు నవంబర్ 21న ఇంట్లో భార్యతో గొడవపెట్టుకొని బయటకు వెళ్ళిపోయాడు. అతనికోసం తిరిగిన కుటుంబీకులు డి సెంబర్ 6న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
అయితే, శుక్రవారం హిజ్రాగా మారిన సురేశ్ లత పేరుతో పోలీస్ స్టేషన్కు వచ్చాడు. హిజ్రాగా మారాల్సిన అవసరం ఎందుకు వచ్చిందనే మీడియా ప్రతినిధులు సురేశ్ను ప్రశ్నించారు. తనను సోదరుడు రాజు పెడుతున్న బాధలు భరించలేక, ఇష్టం లేదని చెప్పినా వినకుండా వివాహం చేయడంతో గత నవంబర్లో ఇంట్లోంచి వెళ్లిన తాను నిజామాబాద్లో ఒక హి జ్రా సహాయంతో బొంబాయికి వెళ్ళి అక్కడ లింగమార్పిడి చేయించుకుని తన పేరును లతగా మార్చుకున్నానని తెలిపా
డు. ఈ పది నెలల కాలంలో తాను మహారాష్ట్ర బల్హార్షాలోని చంద్రాపూర్లో ఉంటూ హిజ్రాగా జీవనాన్ని కొనసాగించానని తెలియజేశాడు. అప్పుడప్పు డూ తన తల్లితో ఫోన్లో మాట్లాడినట్లు తెలిపాడు. తన తల్లి సమాచారం మేరకు పోలీసుల వ ద్దకు వచ్చినట్లు తెలిపాడు. తాను జీవితాంతం ఇలాగే ఉంటానని చెప్పాడు.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications