పెళ్లి పత్రికలను పంచబోతూ .. తిరిగిరాని లోకాలకు ...
పెద్దపల్లి : మరో పదకొండు రోజుల్లో పెళ్లి .. పనుల్లో అందరూ బిజీగా ఉన్నారు. తన స్నేహితులకు స్వయంగా పత్రిక ఇద్దామని పెళ్లికూతురు వెళ్లింది. అయితే అలా వెళ్లడమే పాపమైపోయింది. లారీ రూపంలో మృత్యువు కబళించింది. పెళ్లింట చావు బాజ మోగడంతో ఆ కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. తమ కూతురు లేదనే విషయాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు.

పత్రికలను పంచబోయి ..
పెద్దపల్లి జిల్లా సూల్తానాబాద్ మండలం సుద్దాల గ్రామానికి చెందిన పద్మ తిరుపతి భార్యభర్తలు. వీరి కూతురు హారిక, ఆమె పెళ్లి ఈ నెల 26న నిశ్చయమైంది. తన పెళ్లి పత్రికలను పంచేందుకు హారిక తన సోదరుడితో కలిసి వెళ్లింది. వారి బైక్ ఓదెల మండలం కొలనూరు వెళ్లి తిరిగివస్తోండగా ప్రమాదానికి గురయ్యారు. రేగడమద్దికుంట శివారులో వెనుక నంచి వచ్చన లారీ బైక్ను ఢీ కొట్టింది. దీంతో తీవ్రగాయాలతో హరిక అక్కడికక్కడే మృతిచెందింది. కిరణ్కు గాయాలు కావడంతో దగ్గరిలోని ఆస్పత్రిలో చేర్పించారు.
వెంటాడిన మృత్యువు
మరికొన్నిరోజుల్లో పెళ్లి జరుగుతుందనగా ప్రమాదం జరుగడంతో ఆ కుటుంబసభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. తమ కూతురు తిరిగిరాని లోకాలకు వెళ్లిందనే విషయాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇటు పెళ్లికొడుకు ఫ్యామిలీ మెంబర్స్ కూడా షాక్ గురయ్యారు. ప్రమాద వార్త తెలిసి కన్నీటి పర్యంతమయ్యారు. స్థానికులు, బంధువులు కూడా గుండెలవిసేలా రోదిస్తున్నారు. పెళ్లికూతురు తల్లిదండ్రులను ఆపడం ఎవరితరం కాలేదు.
-
ఈ రాశి వారికి ఆస్తి తగాదాలు తప్పవు..!! -
బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ -
కుప్పకూలిన Gold ETF.. 18 ఏళ్లలో అతిపెద్ద పతనం.. -
తన భార్య గురించి విజయ్ సంచలన కామెంట్స్. 30 ఏళ్లు ఎదురుచూసి! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
Humsafar Express: శ్రీకాకుళం-తిరుపతి కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్-ఆ రోజు నుంచే..! -
సెకెనుకు 40,000 కి. మీ వేగంతో.. భూమి వైపు -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
ఏపీలో ఈ నియోజకవర్గాలు ఇక మహిళలకే, సీనియర్లు.. మంత్రుల స్థానాలు ఔట్..!! -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
అది ఇస్త్రీ కొట్టా ? సాఫ్ట్ వేర్ కంపెనీనా ?? .. అకౌంట్ లో రూ.598 కోట్లు !! -
టోల్ కక్కండి- రేట్ ఖరార్ చేసిన ఇరాన్












Click it and Unblock the Notifications