విద్య: కెసిఆర్తో బ్రిటన్ ప్రతినిధుల భేటీ(పిక్చర్స్)
హైదరాబాద్: బ్రిటన్ సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి రాబ్ లైన్స్, బ్రిటన్ డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రూ మెక్ అలిస్టర్లు గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుతో భేటీ అయ్యారు. విద్యారంగంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఆధునిక, నాణ్యమైన విద్యను వచ్చే ఏడాది నుంచి అమలు చేయనున్నామని, అందుకు సహకరించాలని ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ వారిని కోరారు.
వచ్చే ఏడాది నుంచి విద్యా రంగంలో సమూల మార్పులు చేస్తామని, ఆంగ్ల మాధ్యమంలో ఉచిత నిర్బంధ విద్యను అందించనున్నామని సిఎం కెసిఆర్ వారికి వివరించారు. బ్రిటన్లో మ్యూజియాల తరహాలో సాలార్జంగ్ మ్యూజియాన్ని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతామన్నారు.
ప్రముఖ కవి షేక్ స్పియర్ ఇంటిని హెరిటేజ్ ప్రాపర్టీగా మార్చడంపై సిఎం కెసిఆర్ అభినందనలు తెలిపారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, పరిశ్రమల శాఖ కార్యదర్శి ప్రదీప్చంద్ర, సిఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, తదితరులు పాల్గొన్నారు.
కెసిఆర్
బ్రిటన్ సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి రాబ్ లైన్స్, బ్రిటన్ డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రూ మెక్ అలిస్టర్లు గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుతో భేటీ అయ్యారు.
కెసిఆర్
విద్యారంగంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఆధునిక, నాణ్యమైన విద్యను వచ్చే ఏడాది నుంచి అమలు చేయనున్నామని, అందుకు సహకరించాలని ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ వారిని కోరారు.
కెసిఆర్
వచ్చే ఏడాది నుంచి విద్యా రంగంలో సమూల మార్పులు చేస్తామని, ఆంగ్ల మాధ్యమంలో ఉచిత నిర్బంధ విద్యను అందించనున్నామని సిఎం కెసిఆర్ వారికి వివరించారు.
కెసిఆర్
బ్రిటన్లో మ్యూజియాల తరహాలో సాలార్జంగ్ మ్యూజియాన్ని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతామన్నారు.
కెసిఆర్
తెలంగాణ ఇన్ఫర్మేషన్ ఇంజినీరింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయభాస్కర్ రెడ్డి, చీఫ్ అడ్వైజర్ రాజేశ్వర్ రావు, తదితరులు సచివాలయంలో సిఎం కెసిఆర్ను కలిశారు.