బీఆర్ఎస్ కేడర్ కు కేటీఆర్ శుభవార్త - గెలుపుపై ఇదీ తాజా లెక్క..!!

తెలంగాణలో గెలుపెవరిది. ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నాయి. కేటీఆర్ వీటితో విభేదించారు. ఎగ్జాక్ట్ పోల్స్ లో తమదే విజయం అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ శాతం పై క్లారిటీ..ఓటింగ్ సరళి పై తుది నివేదిక వచ్చిన తరువాత తమకు ఎన్ని స్థానాలు వస్తాయో స్పష్టం చేస్తామని చెప్పారు. ఇప్పుడు కేటీఆర్ పార్టీ శ్రేణులకు గుడ్ న్యూస్ చెప్పారు. పోలింగ్ కు సిద్దం అవుతున్న వేళ గులాబీ నేతల్లో కేటీఆర్ ఇచ్చిన సందేశం టానిక్ లా మారుతోంది.

అధికారంపై ధీమా : తెలంగాణలో పోలింగ్ తరువాత మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ కు అధికారం ఖాయమని తేల్చాయి. కానీ, మరి కొన్ని హంగ్.. మరి కొన్ని బీఆర్ఎస్ కు అనుకూలంగా ఫలితాలు వెల్లడించాయి. మంత్రి కేటీఆర్ ఈ ఎగ్జిట్ పోల్స్ ను తిరస్కరించారు. తాము 70 సీట్లకు పైగా గెలుస్తున్నామని ధీమా వ్యక్తం చేసారు. తుది పోలింగ్ శాతం వచ్చిన తరువాత ఫలితం పై క్లారిటీ వస్తుందన్నారు. కాంగ్రెస్ మాత్రం బీఆర్ఎస్ కు 25 సీట్లు వస్తాయని చెబుతోంది. ఈ పోరులో బీజేపీ అందరి అంచనాలను దాటుతున్నట్లు కనిపిస్తోంది. అయితే, పోలింగ్ రాత్రి వరకు కొనసాగింది. చివరగా పోలింగ్ శాతం 70.66 గా ఎన్నికల సంఘం తేల్చింది. 2018 లో పోలింగ్ శాతం 73.74 శాతంగా ఉంది. ఇదే ఇప్పుడు ఎగ్జిట్ పోల్స అంచనాల పైన సందేహాలకు..తుది ఫలితాలపైన ఉత్కంఠకు కారణమవుతోంది.

BRS working president KT Rama Rao said his party is going to form the government for the third time

ప్రజానాడి పై అంచనాలు : ఈ ఫలితాల పైన బీఆర్ఎస్ వార్ రూమ్ లో సుదీర్ఘ చర్చలు..విశ్లేషణలు చేసారు. అంతిమంగా ఒక నిర్ణయానికి వచ్చారు. కాంగ్రెస్ కు సీట్లు - ఓట్లు పెరిగినా అధికారం దక్కించుకొనే స్థాయిలో లేదనే నిర్దారణకు వచ్చారు. బీజేపీకి వచ్చిన ఓట్ల పైన విశ్లేషణ చేసారు. అంతిమంగా తెలంగాణ ప్రజల తీర్పు తమకే అనుకూలంగా ఉంటుందనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీని పైనే మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. చాలా రోజుల తరువాత మంచి నిద్ర దొరకిందని..ఎగ్జిట్ పోల్స్ హైక్ చేసినా..ఎగ్జాక్ట్ ఫలితాలు మాత్రం శుభవార్త ఇస్తాయని కేటీఆర్ తన ట్వీట్ లో స్పష్టం చేసారు. దీని ద్వారా కౌంటింగ్ తరువాత వచ్చే ఫలితాలు బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉంటాయనే సంకేతాలు ఇచ్చారు.

అధికారం దక్కేదెవరికి : దాదాపు 30 నియోజకవర్గాల్లో బీజేపీ ఫలితాన్ని నిర్దేశించే స్థాయికి చేరిందని బీఆర్ఎస్- కాంగ్రెస్ అంగీకరిస్తున్నాయి. తమ వ్యతిరేక ఓటునే బీజేపీ చీల్చిందని బీఆర్ఎస్ భావిస్తోంది. కాంగ్రెస్ హైప్ చేసినంత స్థాయిలో అనుకూలత ఉంటే గతం కంటే దాదాపు 4 శాతం పోలింగ్ ఎలా తగ్గుందని గులాబీ నేతలు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ కు సీట్లు పెరుగుతాయి కానీ అధికారంలోకి వచ్చే ఫిగర్ సాధించలేదరనేది అంతర్గత చర్చల్లో చెబుతున్న మాట. కానీ, ఓటింగ్ సరళి తమకు అధికారం ఖాయమని తేల్చుతుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఇదే సమయంలో ఓటరు నాడి అర్దం కాని నియోజవకర్గాలు ఉన్నాయి. ఇక, పూర్తి విశ్లేషణ తరువాతనే కేటీఆర్ ఈ ట్వీట్ చేసారని చెబుతున్నారు. మరి..నిజంగా కేటీఆర్ భావిస్తున్నట్లుగా బీఆర్ఎస్ హ్యాట్రిక్ సాధిస్తుందా..అధికారం హస్తగతం అవుతుందా అనేది 3వ తేదీన తేలనుందది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+