Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సర్కార్ ఉత్సవాలకు ధీటుగా బీజేపీ యాక్షన్ ప్లాన్.!ఈ నెల22 వరకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై బీఎస్కే కసరత్తు.!

హైదరాబాద్: దశాబ్ది ఉత్సవాల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం వివిధ రంగాల్లో సాధించిన విజయాలపై పెద్ద ఎత్తున కార్యక్రమాలను చేపడుతున్న నేపథ్యంలో అందుకు ధీటుగా బీజేపీ యాక్షన్ ప్లాన్ ను అమలు చేసేందుకు సిద్ధమైంది. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ చంద్రశేఖర్ రావు పాలనలో ఏ విధంగా దెబ్బతిన్నదనే అంశంపై ఆయా రంగాల వారీగా వివరించడంతోపాటు వినూత్న రూపాల్లో నిరసనలు తెలపాలని నిర్ణయించింది. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రేపు శనివారం రైతు దినోత్సవం నిర్వహిస్తున్న నేపథ్యంలో అందుకు భిన్నంగా చంద్రశేఖర్ రావు పాలనలో వ్యవసాయ రంగం ఏ విధంగా దెబ్బతిన్నది? అనే అంశంపై బీజేపి కార్యాచరణ రూపొందిస్తోంది.

రైతు వ్యతిరేక విధానాలపై శనివారం నిరసనలు : రైతులకిచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన తీరును జనంలోకి తీసుకెళ్లేందుకు బీజేపి సన్నద్దమైంది. అందులోభాగంగా రేపు ఒకవైపు రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో మీడియా సమావేశాలు నిర్వహిస్తూనే, మరోవైపు కిసాన్ మెర్చా ఆధ్వర్యంలో నిరసనలు తెలపాలని నిర్ణయించింది. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ (BSK) ఆదేశం మేరకు నాలుగు రోజుల క్రితమే బీజేపీ నేతలు యాక్షన్ ప్లాన్ పై కసరత్తు చేశారు. రాష్ట్రంలోని పార్టీ సీనియర్ నేతలందరనీ ఈ కార్యక్రమాల్లో భాగస్వాములను చేయాలని నిర్ణయించారు.

banadisanjai
బండి సంజయ్ ఆధ్వర్యంలో పార్టీ నేతల కీలక భేటీ : శుక్రవారం పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉన్న నేతలతో సమావేశమైన బండి సంజయ్ కుమార్ (BSK) యాక్షన్ ప్లాన్ పై చర్చించారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శ్రుతి, ఉపాధ్యక్షులు కాసం వెంకటేశ్వర్లు, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి, జాతీయ నాయకురాలు ఆకుల విజయ, అధికార ప్రతినిధులు సీహెచ్.విఠల్, ఎన్వీ సుభాష్, రాణి రుద్రమదేవి, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆలె భాస్కర్, రాష్ట్ర నాయకులు దరువు ఎల్లన్న, డాక్టర్ పుల్లారావు తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

banadisanjai
తెలంగాణ ప్రజల చైతన్యమే లక్ష్యమంటున్న బీఎస్కే : ఈ సందర్భంగా బండి సంజయ్ కుమార్ (బీఎస్కే) మాట్లాడుతూ ప్రతిరోజు ప్రభుత్వం ఏ రంగంపై కార్యక్రమాలు చేపడుతుందో... ఆయా రంగాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపడంతోపాటు ఆయా రంగానికి సంబంధించిన ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఎండగట్టేలా వివిధ రూపాల్లో వినూత్న రీతిలో కార్యక్రమాలు రూపొందించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఈనెల 3న రైతు వ్యతిరేక విధానాలపై జాతీయ, రాష్ట్ర నాయకులతో మీడియా సమావేశాలు నిర్వహిస్తూనే.... కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలను నిర్వహించాలని కోరారు.

banadisanjai
ఇది అంతం కాదు ఆరంభమంటున్న బీజేపి చీఫ్ : జూన్ 4న పోలీస్ వ్యవస్థను చంద్రశేఖర్ రావు కుటుంబం సొంత ప్రయోజనాలకు ఏ విధంగా ఉపయోగించుకుంటోందనే అంశంతోపాటు పోలీసులు పడుతున్న ఇబ్బందులను కూడా ప్రజల ద్రుష్టికి తేవాలని సూచించారు. జూన్ 5న విద్యుత్ ఛార్జీల పెంపుతో ప్రజలపై పడుతున్న భారంతోపాటు సీఎం చంద్రశేఖర్ రావు పాలనలో విద్యుత్ సంస్థలు ఏ విధంగా దివాళా తీశాయనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తానే స్వయంగా రంగంలోకి దిగబోతున్నట్టు బండి సంజయ్ కుమార్ (బీఎస్కే) వివరించారు. ఈ నెల22 వరకు చేపట్టాల్సిన కార్యక్రమాలతో పాటు వివిధ రంగాల వారీగా చంద్రశేఖర్ రావు పాలనా వైఫల్యాలను వినూత్న రీతిలో ఎండగట్టేందుకు కమలనాథులు సిద్ధమైనట్టు తెలుస్తోంది.
More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+