సర్కార్ ఉత్సవాలకు ధీటుగా బీజేపీ యాక్షన్ ప్లాన్.!ఈ నెల22 వరకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై బీఎస్కే కసరత్తు.!
హైదరాబాద్: దశాబ్ది ఉత్సవాల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం వివిధ రంగాల్లో సాధించిన విజయాలపై పెద్ద ఎత్తున కార్యక్రమాలను చేపడుతున్న నేపథ్యంలో అందుకు ధీటుగా బీజేపీ యాక్షన్ ప్లాన్ ను అమలు చేసేందుకు సిద్ధమైంది. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ చంద్రశేఖర్ రావు పాలనలో ఏ విధంగా దెబ్బతిన్నదనే అంశంపై ఆయా రంగాల వారీగా వివరించడంతోపాటు వినూత్న రూపాల్లో నిరసనలు తెలపాలని నిర్ణయించింది. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రేపు శనివారం రైతు దినోత్సవం నిర్వహిస్తున్న నేపథ్యంలో అందుకు భిన్నంగా చంద్రశేఖర్ రావు పాలనలో వ్యవసాయ రంగం ఏ విధంగా దెబ్బతిన్నది? అనే అంశంపై బీజేపి కార్యాచరణ రూపొందిస్తోంది.
రైతు వ్యతిరేక విధానాలపై శనివారం నిరసనలు : రైతులకిచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన తీరును జనంలోకి తీసుకెళ్లేందుకు బీజేపి సన్నద్దమైంది. అందులోభాగంగా రేపు ఒకవైపు రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో మీడియా సమావేశాలు నిర్వహిస్తూనే, మరోవైపు కిసాన్ మెర్చా ఆధ్వర్యంలో నిరసనలు తెలపాలని నిర్ణయించింది. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ (BSK) ఆదేశం మేరకు నాలుగు రోజుల క్రితమే బీజేపీ నేతలు యాక్షన్ ప్లాన్ పై కసరత్తు చేశారు. రాష్ట్రంలోని పార్టీ సీనియర్ నేతలందరనీ ఈ కార్యక్రమాల్లో భాగస్వాములను చేయాలని నిర్ణయించారు.



-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!











Click it and Unblock the Notifications