కేసీఆర్ పార్టీతో పొత్తుకు బీఎస్పీ అధినేత్రి మాయావతి గ్రీన్ సిగ్నల్
లక్నో/హైదరాబాద్: తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ముందు కొత్త రాజకీయ పొత్తు ఖరారైంది. బీఆర్ఎస్ పార్టీతో పొత్తుకు బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి అంగీకారం తెలిపారు. ఈ మేరకు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ సోషల్ మీడియా ఎక్స్(ట్విట్టర్) వేదికగా ట్వీట్ చేశారు.
బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం ఏ కూటమిలోనూ లేనందున మాయావతి పొత్తుకు అంగీకరించినట్లు ఆర్ఎస్ ప్రవీణ్ వెల్లడించారు. ఎంపీ ఎన్నికల్లో గులాబీ పార్టీతో కలిసి పోటీ చేస్తున్నట్లు, ఇరు పార్టీల పొత్తుపై త్వరలో కేసీఆర్తో తదుపరి చర్చలు ఉంటాయని ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ క్రమంలో కేసీఆర్తో చర్చలకు ఎంపీ రాంజీ మాయావతి దూతగా వస్తారని ఆయన వెల్లడించారు. ఇటీవల ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని బీఎస్పీ అధినేత్రి మాయావతి చేసిన వ్యాఖ్యలతో సందిగ్ధత నెలకొన్న సంగతి తెలిసిందే.

కాగా, ఇప్పటికే తెలంగాణ బీఎస్పీ పార్టీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ను ఇటీవల కలిసిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలోనే పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తుపై చర్చించారు. అప్పుడే పొత్తు ఉంటుందని ప్రకటించారు. ఈ క్రమంలోనే బీఎస్పీ అధినేత్రి మాయామవతి కూడా బీఆర్ఎస్ పార్టీతో పొత్తుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. దీంతో త్వరలోనే సీట్ల పంపకాలపై చర్చించి, నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications