వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎసిబి, బాబు, జగన్, కెసిఆర్‌లపై సెబాస్టియన్ సంచలనం, జనార్ధన్ ఎవరో చెప్పారు!

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఓటుకు నోటు కేసు కీలక మలుపు తిరుగుతోన్నట్లుగా తెలుస్తోంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సెబాస్టియన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. చంద్రబాబుకు తెలియకుండా ఎవరూ ఏం చేయలేరని వ్యాఖ్యానించారు.

Cash for Vote: Sebastian interesting comments on Chandrababu

ఓటుకు నోటు కేసులో తాము తప్పు చేస్తే చట్టం తమను తప్పకుండా శిక్షిస్తుందని చెప్పారు. తాను క్రిష్టియన్ కాబట్టి వేధిస్తున్నారని చెప్పారు. తాను ఎక్కడ కూడా భూకబ్జాలకు పాల్పడలేదని చెప్పారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఆఫీస్ ఇంఛార్జ్ జనార్ధన్‌కు అన్నీ తెలుసునని చెప్పారు.

జనార్ధనే తమను చంద్రబాబు వద్దకు తీసుకు వెళ్లారని తెలిపారు. ఓటు నోటు విషయమై జనార్ధన్‌కు అన్నీ తెలుసునని ఆయన చెప్పారు. చంద్రబాబుకు తెలియకుండా ఎవరూ ఏం చేయలేరని చెప్పారు. పార్టీ, చంద్రబాబు పనులు జనార్ధనే చూస్తారని ఆయన చెప్పారు.

తన ఫోన్లో ఎలాంటి రికార్డులు లేవని ఆయన చెప్పారు. ఏసీబీ అధికారులు చెబుతున్నట్లుగా తన ఫోన్లో ఎలాంటి రికార్డులు లేవన్నారు. ఏసీబీ తన ఫోన్ ట్యాప్ చేసిందని ఆరోపించారు. తెలంగాణ సీఎం కెసిఆర్, వైసీపీ అధ్యక్షులు జగన్ కలిసి క్రైస్తవులను అణిచివేసేందుకు తనపై కుట్ర పన్నారన్నారు.

English summary
Cash for Vote: Sebastian interesting comments on Chandrababu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X