కేసీఆర్పై సీబీఐ, ఈడీ కేసు పెట్టలేదు, ఎందుకు?: ’మేడారం‘ జాతీయ పండగ అంటూ రాహుల్ కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్: బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా తెలంగాణ ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ. ములుగులో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభలో రాహుల్ పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో దొరల తెలంగాణ.. ప్రజల తెలంగాణ మధ్య ఎన్నికలు జరుగుతున్నాయన్నారు.
2004లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తామని హామీ ఇచ్చింది.. ఆ హామీ నిలబెట్టుకుందన్నారు. సాధారణంగా తమకు నష్టం కలిగించే నిర్ణయాలు పార్టీలు తీసుకోవని.. కానీ, కాంగ్రెస్ మాత్రం తనకు నష్టం కలుగుతుందని తెలిసినా తెలంగాణ ఇచ్చిందన్నారు రాహుల్. కేసీఆర్ గతంలో ఎన్నో హామీలు ఇచ్చారన్నారు. మూడెకరాల భూమి, రైతు రుణమాఫీ.. ఇలా ఏ హామీని నెరవేర్చలేదని మండిపడ్డారు.

రాజస్థాన్లో ఆరోగ్య పథకం ద్వారా ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత వైద్యం అందిస్తోంది. రైతులకు ఇచ్చిన హామీ మేరకు ఛత్తీస్గఢ్లో వారి ధాన్యాన్ని అధిక ధరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా వరి ధాన్యానికి ఛత్తీస్గఢ్లో ఎక్కివ ధర చెల్లించి కొంటున్నారు. కర్ణాటకలో ఇచ్చిన 5 గ్యారంటీలను కాంగ్రెస్ అమలు చేసి చూపింది. రాష్ట్రంలో పోడు, అసైన్డ్ భూముల విషయంలో అందరికీ న్యాయం చేస్తామన్నారు రాహుల్ గాంధీ.

కాంగ్రెస్ విజయభేరి యాత్ర:
— Telangana Congress (@INCTelangana) October 18, 2023
బహిరంగ సభకు విచ్చేసిన రాహుల్ గాంధీ గారు మరియు ప్రియాంక గాంధీ గారికి శాలువా కప్పి సన్మానించి జ్ఞాపికలు అందజేసిన నేతలు.
ముఖ్య నాయకులు వారిని శాలువాలతో సన్మానించారు. ఎమ్మెల్యే సీతక్క గారు బతుకమ్మను అందించిన అనంతరం సమ్మక్క సారలమ్మ చిత్రపటాన్ని వారికి… https://t.co/6099FSm44N pic.twitter.com/KU9kB3IPXY
తెలంగాణలోనూ మేం ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసి చూపుతామని రాహుల్ గాంధీ అన్నారు. దేశంలో అధికారంలోకి రాగానే సమ్మక్క సారక్క జాతరను జాతీయ ఉత్సవంగా ప్రకటిస్తామన్నారు. తెలంగాణలో బీఆరెస్ కాంగ్రెస్ మధ్యనే పోటీ అని అన్నారు. తెలంగాణలో బీఆరెస్ గెలవాలని బీజేపీ కోరుకుంటోందన్నారు.వీరికి ఎంఐఎం మద్దతు ఇస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ను ఓడించేందుకు ఈ మూడు పార్టీలు కలిసి కుట్రలు చేస్తున్నాయి. తెలంగాణతోపాటు ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోందన్నారు రాహుల్.
#WATCH | Mulugu: Congress MP Rahul Gandhi says, "CBI or ED has not filed any case against Telangana CM. Cases have been filed against every leader of the opposition but your CM...If you cast your vote for BRS it will be for BJP..." pic.twitter.com/VjFC2WhXaK
— ANI (@ANI) October 18, 2023
'సీబీఐ, ఈడీలు.. దేశంలోని విపక్ష నేతలందరిపైనా కేసులు పెట్టినా... కేసీఆర్పై ఒక్కకేసు పెట్టలేదు.. ఎందుకు అని ప్రశ్నించారు రాహుల్.
బీఆర్ఎస్కు ఓటేస్తే.. బీజేపీకి ఓటేసినట్టేనని అన్నారు. దేశంలో బీజేపీపై మేము యుద్ధం చేస్తున్నాం. అందుకే కాంగ్రెస్కు మద్దతు తెలపండి. బీజేపీని, బీజేపీ బీ టీమ్ బీఆర్ఎస్ను కూడా ఓడించండి అని ప్రజలకు రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు.
-
కేంద్రానికి కవిత షాకింగ్ అల్టిమేటం.. ఆ విషయంలో పోరాటమే! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..!












Click it and Unblock the Notifications