ఈటలకు కేంద్ర బలగాలతో భద్రత - హత్యకు కుట్ర..!!
తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మాజీ మంత్రి..బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన ఆరోపణలు చేసారు. తనను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఇందుకోసం రూ 20 కోట్ల సుపారీ ఇచ్చారని చెప్పుకొచ్చారు. ఈటల సతీమణి జమున ఇవే ఆరోపణలు చేయటం కలకలంగా మారాయి. ఇదే సమయంలో ఈటెల కు కేంద్ర బలగాలతో భద్రతకు నిర్ణయించింది.
ఈటల సంచలన ఆరోపణలు
బీజేపీ నేత ఈటల రాజేందర తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తనను చంపేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి కుట్ర పన్నారంటూ తన సతీమణి జమున చెప్పిన విషయం వాస్తవమేనన్నారు. ప్రగతిభవన్ స్కెచ్ ప్రకారమే హుజూరాబాద్ నియోజకవర్గంలో అరాచకం సృష్టిస్తున్నారని ఆరోపించారు.

ఇక బీజేపీలో తానేమీ అసంతృప్తితో లేనని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నుంచి తనను బయటికి పంపించినప్పుడు బీజేపీ అక్కున చేర్చుకుందన్నారు. అయితే తాను పార్టీ వదలివెళ్లాలని కొంతమంది కోరుకున్నారని చెప్పారు. పార్టీ అన్నప్పుడు భేదాభిప్రాయాలు సహజమని అన్నారు. అయినా.. పార్టీ మారడం బట్టలు మార్చినంత ఈజీ కాదని వ్యాఖ్యానించారు. అధిష్ఠానం పిలిస్తేనే ఢిల్లీకి వెళ్లానని, ఎవరిపైనా ఫిర్యాదు చేయలేదని పేర్కొన్నారు.
కౌశిక్ రెడ్డి కుట్ర చేస్తున్నారు
అంతకు ముందు తన భర్త రాజేందర్ను హత్య చేసేందుకు సీఎం కేసీఆర్ ప్రోత్సాహంతో ఎమ్మెల్సీ కౌశిక్రెడ్డి కుట్ర చేస్తున్నారని ఈటల జమున ఆరోపించారు. రూ.20 కోట్లు ఇచ్చి ఈటలను చంపిస్తానంటూ కౌశిక్రెడ్డి తన సన్నిహితులతో అన్నట్లు తెలిసిందన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమకారులపై దాడులు చేసిన చరిత్ర కౌశిక్రెడ్డిదని చెప్పుకొచ్చారు.

అమరవీరుల స్తూపంపై రాజేందర్ పేరు ఉన్నందునే దానిని కూల్చివేశారని ఆరోపించారు. సీఎం కేసీఆర్కు ఈటలపై ఉన్నన కోపంతో కౌశిక్రెడ్డిని హుజూరాబాద్ ప్రజలపై ఉసిగొల్పుతున్నారని జమున తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో కౌశిక్రెడ్డి అరాచకాలకు అంతేలేకుండా పోతోందన్నారు. గతంలో గవర్నర్పైనే అనుచిత వ్యాఖ్యలు చేసినా కౌశిక్రెడ్డిని సీఎం కనీసం మందలించలేదని విమర్శించారు.
కేంద్ర బలగాలతో భద్రత
ఈటెల హత్యకు కుట్ర ఆరోపణల వేళ కేంద్ర హోం శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈటల రాజేందర్కు కేంద్ర హోంశాఖ వై కేటగిరీ భద్రత కేటాయించింది. 8 ప్లస్ 8 సిబ్బందితో ఆయనకు భద్రత కల్పించనుంది. ప్రస్తుతం కొనసాగుతున్న 2 ప్లస్ 2 భద్రతకు ఇది అదనం అని బీజేపీ వర్గాలు వెల్లడించాయి.
తన భర్త హత్యకు కుట్ర జరుగుతోందని జమున ఆరోపించటం.. ఆ తరువాత రాజేందర్ ఇదే విషయాన్ని నిర్దారిస్తూ మాట్లాడారు. ఆ తరువాత కొద్ది గంటల్లోనే ఈటెలకు కేంద్ర బలగాలతో భద్రత కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుందని బీజేపీ వర్గాలు నిర్దారించాయి. తాజాగా ఢిల్లీ వెళ్లి పార్టీ అగ్రనేతలతో సమావేశమైన సమయంలోనే ఈటల రాష్ట్రంలోని తాజా పరిస్థితుల పైన వివరించినట్లు వెల్లడించారు.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications