తెలంగాణలో లెక్క తేలింది - అధికారికం..!!
తెలంగాణలో ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇప్పుడు అందరూ ఎన్నికల ఫలితాల వైపే చూస్తున్నారు. పోలింగ్ శాతం గెలుపు ఓటమలను ప్రభావితం చేయనుంది. 2018 ఎన్నికల కంటే పోలింగ్ శాతం తగ్గింది. హైదరాబాద్ మినహా మిగిలిన జిల్లాల్లో పోలింగ్ బాగానే నమోదు అయింది. రాష్ట్రంలో డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరుగుతుందని, అందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎగ్టిట్ పోల్స్ ఓటరు నాడి స్పష్టం చేసినా..తుది ఫలితాలపైన ఉత్కంఠ కొనసాగుతోంది.
రాష్ట్రంలో మొత్తం 70.74 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల అధికారి వికాస్రాజ్ తెలిపారు. 2018 ఎన్నికలతో పోలిస్తే 2023లో పోలింగ్ 3 శాతం తగ్గిందని చెప్పారు. 2018లో 73.37 శాతం పోలింగ్ నమోదైందని వెల్లడించారు. రాష్ట్రంలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు ఓట్లు ఎక్కవగా నమోదయ్యాయని చెప్పారు.ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 49 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. ఇది మంచి ఫలితాలను ఇచ్చిందని అన్నారు. ఈ ఎన్నికల్లో లక్షా 80 వేల మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారని వికాస్ రాజ్ తెలిపారు.

ఇక నియోజక వర్గాల వారీగా చూస్తే మునుగోడులో అత్యధికంగా 91.5 శాతం, యాకుత్పురాలో 39.6 శాతం పోలింగ్ నమోదైందని వికాస్ రాజ్ వెల్లడించారు. చాలా చోట్ల రాత్రి 9.30 వరకు పోలింగ్ జరిగిందని తెలిపారు. ఆదివారం ఉదయం 8.00 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెకిస్తారని, ఉదయం 8.30 గంటల నుంచి ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని ఆయన చెప్పారు. ఈసారి ఓటర్లలో 18, 19 ఏండ్ల వయసున్న వారు 3.06 శాతం ఉన్నారన్నారు. ఓట్ ఫ్రమ్ హోమ్ మంచి ఫలితాలను ఇచ్చిందని, 80 ఏండ్లు పైబడిన వారికి ఓట్ ఫ్రమ్ హోమ్ అవకాశం కల్పించామని అన్నారు.
రాష్ట్రంలో రీపోలింగ్కు అవకాశం లేదని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా 90.03 శాతం, హైదరాబాద్లో అత్యల్పంగా 46.56 శాతం పోలింగ్ నమోదైందని తెలిపారు. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ వెల్లడైనా ఇంకా తుది ఫలితం పైన పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ తమదే విజయమని చెబుతున్నాయి. బీజేపీ గణనీకంగా పంజుకుందనే లెక్కలతో పోలింగ్ సరళి ఒక విధంగా సర్వే సంస్థలకు అంతు చిక్కటం లేదు. దీంతో..ఈ నెల 3న జరిగే కౌంటింగ్ పైన ఉత్కంఠ పెరుగుతోంది.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications