కరచాలనం, ఏకాంత భేటీ: అప్పగింతపై మళ్లీ చెప్తానని కేసీఆర్కు బాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురువారం నాడు మరోసారి కలిశారు. ఇరువురు మాట్లాడుకున్నారు. కరచాలనం చేసుకున్నారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురువారం నాడు మరోసారి కలిశారు. ఇరువురు మాట్లాడుకున్నారు. కరచాలనం చేసుకున్నారు. ఇరువురు సీఎంలు గవర్నర్ నరసింహన్తో ఏకాంతంగా పదిహేను నిమిషాలు మాట్లాడారు.
నగదు రహిత లావాదేవీల గురించి ఈ సందర్భంగా చర్చించారు. ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయం సబబేనని, తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు ఎదురైనా దీర్ఘకాలికంగా సత్ఫలితాలు వస్తాయని ఇరువురు సీఎంలు అభిప్రాయం వ్యక్తం చేశారు.
పెద్దనోట్ల రద్దు అనంతరం ఏపీలో ప్రజలు ఇబ్బందులు పడకుండా అప్రమత్తంగా వ్యవహరించామని, అలాగే నగదురహిత లావాదేవీలను ప్రోత్సహిస్తామని చంద్రబాబు అన్నారు. అలాగే సీఎెంల ప్యానెల్ చేసిన సూచనలకు మోడీ కితాబిచ్చారన్నారు.
క్యాష్ లెస్ విధానంపై కేంద్రం, ఇరు రాష్ట్రాలు సహకరించుకోవాలని సీఎంలు అభిప్రాయపడగా, గవర్నర్ అభినందించారు. సచివాలయ భవనాల అప్పగింతపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు చెప్పారు. తన తిరుపతి రాక గురించి ఇంకా అనుకోలేదని కేసీఆర్ చెప్పారు. విశాఖ సీఐఐ పెట్టుబడుల సదస్సు విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
ఓటుకు నోటు కేసు అనంతరం చంద్రబాబు - కేసీఆర్ల మధ్య విభేదాలు కనిపించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అంతా సద్దుమణిగింది. అప్పటి నుంచి ఇరువురు సీఎంలు ఎప్పుడు కలిసినా చర్చనీయంగా మారుతుంది.

ఈ రోజు గవర్నర్ నరసింహన్ రాజ్ భవన్లో ఎట్ హోం పేరుతో తేనీటి విందు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇరు రాష్ట్రాలకు చెందిన పలువురు నేతలు హాజరయ్యారు.
-
తెలుగు ప్రజలకు సీఎం చంద్రబాబు, రేవంత్రెడ్డి "ఉగాది" స్పెషల్ విషెస్ !!! -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే?












Click it and Unblock the Notifications