ఘోరం: చిల్లర అడిగితే చితకబాదారు.. తప్పించుకునే ప్రయత్నంలో లారీ గుద్దేసింది
హైదరాబాద్ లోని హయత్ నగర్ లో దారుణం జరిగింది. కేవలం నాలుగు రూపాయల చిల్లర విషయమై ఇద్దరి నడుమ తలెత్తిన వివాదం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది.
హైదరాబాద్: హయత్ నగర్ లో దారుణం జరిగింది. కేవలం నాలుగు రూపాయల చిల్లర విషయమై ఇద్దరి నడుమ తలెత్తిన వివాదం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. హయత్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
వర్డ్ అండ్ డీడ్ స్కూలు సమీపంలోని పాన్ షాపులో రాజేష్ అనే వ్యక్తి సిగరెట్ కొన్నాడు. సిగరెట్ కోసం కొంత డబ్బు ఇవ్వగా పాన్ షాపు యజమాని.. రాజేష్ కు నాలుగు రూపాయలు తిరిగి ఇవ్వాల్సి వచ్చింది. ఇదే విషయంలో షాపు యజమాని, రాజేష్ కు మధ్య వివాదం తలెత్తింది.

ఈ నేపథ్యంలో పాన్ షాపు యజమాని, అతని స్నేహితులు కలిసి రాజేష్ పై దాడి చేసి చితకబాదారు. దెబ్బలు భరించలేక రాజేష్ వారి నుంచి తప్పించుకునేందుకు రోడ్డు మీదికి పరుగుదీశాడు.
రోడ్డు దాటే ప్రయత్నం చేస్తుండగా అదే సమయంలో వేగంగా వచ్చిన ఓ లారీ అతడ్ని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో రాజేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాద స్థలికి చేరుకున్న పోలీసులు సీసీ ఫుటేజీ అధారంగా కేసు నమోదు చేసుకుని, ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications