పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్ప్రెస్
Charminar express: చెన్నై- హైదరాబాద్ మధ్య నడిచే చార్మినార్ ఎక్స్ప్రెస్ ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 50 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. వారికి అత్యవసర చికిత్స అందిస్తోన్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం కలగలేదు.
Recommended Video

ఈ ఉదయం నాంపల్లి రైల్వే స్టేషన్లో ఈ ఘటన సంభవించింది. చెన్నైలోని డాక్టర్ ఎంజీ రామచంద్రన్ సెంట్రల్ స్టేషన్ నుంచి బయలుదేరిన చార్మినార్ ఎక్స్ప్రెస్ ఈ ఉదయం నాంపల్లికి చేరుకుంది. స్టేషన్లో ప్రవేశించినప్పుడు ప్రమాదానికి గురైంది. పట్టాలు తప్పింది. ప్లాట్ ఫామ్ నంబర్ 5 మీదికి వచ్చిన అనంతరం పట్టాలు తప్పింది. నేరుగా వెళ్లి ఎదురుగా ఉన్న గోడను ఢీకొట్టింది.

ఈ ఘటనలో సుమారు 50 మంది ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో నాంపల్లి స్టేషన్లో కలకలం చోటు చేసుకుంది. అంబులెన్సుల సైరన్ మోతలతో మారుమోగింది. ప్రయాణికులు, వారి బంధువుల రాకతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

నాంపల్లి లో చార్మినార్ ఎక్స్ ప్రెస్ ప్రమాదం..!!#CharminarExpress #NampallyRailwayStation #Oneindiatelugu pic.twitter.com/4BOEbvTbV3
— oneindiatelugu (@oneindiatelugu) January 10, 2024
ఈ సమాచారం అందిన వెంటనే దక్షిణ మధ్య రైల్వే అధికారులు నాంపల్లి రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రాణాపాయం సంభవించలేదని, కొందరు ప్రయాణికులు స్వల్పంగా గాయాలయ్యాయని తెలిపారు. వారికి చికిత్స అందిస్తున్నామని చెప్పారు. పట్టాలు తప్పడానికి గల కారణాలపై రైల్వే అధికారులు పూర్తి స్థాయి దర్యాప్తునకు ఆదేశించారు.
-
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణపై భారీ శుభవార్త! -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications