ఏఎన్ఆర్ జాతీయ అవార్డు అందుకున్న చిరంజీవి.. మోహన్ బాబుపై పరోక్ష కామెంట్స్
మెగాస్టార్ చిరంజీవి బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ చేతులమీదుగా ఏఎన్ఆర్ జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. 2024 సంవత్సరానికి గాను ఈ అవార్డును చిరంజీవికి ప్రకటించారు. అన్నపూర్ణ స్టూడియోలో ఈరోజు జరిగిన అక్కినేని జాతీయ పురస్కార వేడుకకు అమితాబ్ బచ్చన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఏఎన్ఆర్ జాతీయ పురస్కారాన్ని అమితాబ్... చిరంజీవికి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా చిరంజీవికి శాలువా కప్పి సన్మానించారు.

ఈ కార్యక్రమానికి చిరంజీవి కుటుంబ సభ్యులు, నాగార్జున కుటుంబ సభ్యులతో పాటు సినీ రంగానికి చెందిన పలువురు హాజరయ్యారు. తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి సందర్భంగా నాగార్జున ఈ అవార్డును ప్రకటించారు. ఈ సందర్భంగా చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు.
సినిమా పరిశ్రమలోనూ వజ్రోత్సవాల సమయంలో తనకు లెజెండరీ అవార్డు ఇచ్చినప్పుడు కొంతమంది వ్యతిరేకించారని, దీంతో ఆ అవార్డు తీసుకోకుండా క్యాప్సూల్ బాక్సులో వేసిన సంగతి గుర్తు చేసుకున్నారు.పద్మ విభూషణ్ సహా ఎన్నో అవార్డులు వచ్చినా అసంతృప్తి మిగిలే ఉంది' అని చిరంజీవి ఎమోషన్ కామెంట్స్ చేశారు.కానీ ఇప్పుడు ఏఎన్ఆర్ జాతీయ అవార్డు ఇచ్చిన ఈ రోజున... అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా ఇచ్చిన ఈ రోజున... నా మిత్రుడు నాగార్జున నాకు మనస్ఫూర్తిగా ఈ అవార్డు ఇచ్చిన రోజున... ఇప్పుడు నాకు ఇంట గెలిచానని అనిపిస్తోందన్నారు. నేను ఇంటా గెలిచాను... రచ్చా గెలిచానన్నారు.
-
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల












Click it and Unblock the Notifications