ప్రజలను తాగుబోతులను చేయొద్దు, తెలంగాణ ఇందుకేనా?: చుక్కా రామయ్య
హైదరాబాద్: చీప్లిక్కర్ను ప్రవేశపెట్టి తెలంగాణ ప్రజలను తాగుబోతులుగా మార్చవద్దని ప్రభుత్వానికి దండం పెట్టి కోరుతున్నానని మాజీ ఎమ్మెల్సీ, ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య అన్నారు.
ప్రజలపై మద్యం, చీప్ లిక్కర్ రుద్దే ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుదామని పిలుపునిస్తూ ప్రగతి శీల మహిళా సంఘం (పిఓడబ్ల్యు) ఆధ్వర్యంలో సోమవారం ఇందిరాపార్కు వద్ద మహాధర్నా నిర్వహించారు. పిఓడబ్ల్యు అధ్యక్షురాలు సంధ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో చుక్కా రామయ్య పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ తెచ్చుకున్నది తాగి ఊగటానికి కాదన్నారు. విద్య, వైద్యం, ఉపాధి, పంటలు సాధించుకునేదిపోయి, లక్ష్యాన్ని విస్మరిస్తూ చీప్లిక్కర్ మీద పడటం బాధాకరమని పేర్కొన్నారు.
తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ నేత విమలక్క మాట్లాడుతూ.. ప్రభుత్వం మద్యం విదానాన్ని మార్చుకోవాలని సూచించారు. మానవ హక్కుల సంఘం నేత జీవన్కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రధాన సమస్యలన్నీ ప్రక్కనబెట్టి ముఖ్యమంత్రి చీప్లిక్కర్ ప్రవేశపెట్టడం హాస్యాస్పదమని విమర్శించారు. ఈకార్యక్రమంలో ప్రజా, మహిళాసంఘాల ప్రతినిధులు జ్యోత్స్న, ప్రొ.లక్ష్మణ్ పాల్గొన్నారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications