నగర వాసులకు ఆహ్లాదం.!ఎటు చూసినా పచ్చదనమే.!జీహెచ్ఎంసీ వినూత్నంగా మొక్కల పెంపకం.!
హైదరాబాద్: పర్యావరణ పరిరక్షణతో పాటుగా సమతుల్యతను దృష్టిలో పెట్టుకొని నగర వాసులకు చక్కటి వాతావరణ కల్పించేందుకు వివిధ వినూత్న ఆలోచనలకు అనుగుణంగా విరివిరిగా మొక్కలు పెంచడం జరుగుతున్నదని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కోటి మొక్కలు నాటే కార్యక్రమం సందర్భంగా శనివారం బంజారాహిల్స్ గఫార్ ఖాన్ పార్క్ లో మేయర్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ... తెలంగాణకు హరిత కార్యక్రమంలో భాగంగా జిహెచ్ఎంసి పరిధిలో 2014 నుండి 2022-23 వరకు 741 లక్షల మొక్కలు నాటేందుకు లక్ష్యం కాగా 698.78 లక్షల మొక్కలు నాటినట్లు మేయర్ వివరించారు.
జిహెచ్ఎంసి పరిధిలో పచ్చదనం : అవెన్యూ ప్లాంటేషన్, కాలనీ ఇనిస్టిట్యూషన్, ఓపెన్ స్పేస్, స్మశాన వాటికల్లో, మొదలైన వినూత్న, పద్ధతిలో జిహెచ్ఎంసి పరిధిలో పచ్చదనం పెంచేందుకు కృషి చేస్తున్నట్లు మేయర్ తెలిపారు. జిహెచ్ఎంసి బడ్జెట్ లో ప్రత్యేకంగా ఈ సంవత్సరంలో రూ. 326 కోట్ల రూపాయలు కేటాయించినట్లు చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో 50 లక్షల మొక్కల పెంపకం లక్ష్యం కాగా లక్ష్యాన్ని మించి 77.29 లక్షల మొక్కలు పెంచడం జరిగిందని అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో తెలంగాణకు హరిత హారం కార్యక్రమంలో భాగంగా జిహెచ్ఎంసి కి 50 లక్షల మొక్కలు నాటే లక్ష్యం కాగా ఇప్పటి వరకు సుమారు 42 లక్షల మొక్కలు నాటడం జరిగిందనన్నారు మేయర్.














Click it and Unblock the Notifications