Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

‘‘ఇదేమీ కేసీఆర్ అయ్య జాగీర్ కాదు, అడ్డగోలుగా ప్రవర్తించడానికి’’

రాజన్న సిరిసిల్ల జిల్లా నేరేళ్ల ఘటనపై రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదని అధికారపక్ష నేతలు అనడంపై కాంగ్రెస్ తెలంగాణ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఘాటుగా స్పందించారు.

హైదరాబాద్: రాజన్న సిరిసిల్ల జిల్లా నేరేళ్లలో పదకొండు మందిపై దాడి జరిగితే అందులో నలుగురు మాత్రమే దళితులు ఉన్నారని.. ఈ విషయాన్ని రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదని అధికారపక్ష నేతలు అనడంపై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఘాటుగా స్పందించారు.

ఈ విషయమై ఓ న్యూస్ ఛానెల్ అడిగిన ప్రశ్నకు ఉత్తమ్ సమాధానమిస్తూ, 'దళితులు కాని వాళ్లపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించవచ్చా? ముఖ్యమంత్రి చెప్పే సమాధానమిదా? ' అని ప్రశ్నించారాయన.

uttam-kumar-reddy

అంతేకాదు, అసలు, ఈ విధంగా మాట్లాడుతున్న వారికి కామన్ సెన్స్ ఉందా? ఏ కులం వారినైనా సరే, అక్రమంగా పోలీసులు అదుపులోకి తీసుకుని టార్చర్ పెట్టి, కరెంట్ షాక్ పెట్టొచ్చా? ఈ ఘటనపై ముఖ్యమంత్రి ఎందుకు చర్యలు తీసుకోరు? అని నిలదీశారు.

ఈ సంఘటనపై ఆ జిల్లా ఎస్పీ.. 'టార్చర్ చేయమంటేనే చేశాం' అని చెబుతున్నారు. అందుకే, పోలీసులపై సీఎం కేసీఆర్ చర్యలు తీసుకోవట్లేదని, ఈ విషయాన్ని తామూ వదలిపెట్టమని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

అంతేకాదు, ఇదేమీ కేసీఆర్ అయ్య జాగీర్ కాదు.. అడ్డగోలుగా ప్రవర్తించడానికి.. పోలీసులేమీ ఆయన ప్రైవేట్ సైన్యం కాదు.. ఈ విషయమై తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా ప్రతిఘటిస్తుంది..' అని ఉత్తమ్ హెచ్చరించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+