ప్రగతి సింగారం ప్రగతికి రూ.10 కోట్లు.. గ్రామంపై సీఎం వరాలు
హైదరాబాద్ : ప్రగతి సింగారం గ్రామ ప్రగతికి సీఎం కేసీఆర్ ఔదార్యం చూపించారు. గ్రామాభివృద్ధి కోసం రూ.10 కోట్లు విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. వీటితో గ్రామంలో రహదారులు, డ్రైనేజీ క్లీనింగ్ ఇతర అభివృద్ధి పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆయా కులసంఘాలకు కమ్యూనిటీ హాళ్లు .. విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.
వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట మండలం ప్రగతిసింగారం అభివృద్ధి పుంతలు తొక్కనున్నది. గ్రామా అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ చూపించారు. రూ.10 కోట్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో గ్రామం అభివృద్ధికి బాటలు పట్టనుంది. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తండ్రి మల్లారెడ్డి దశదినకర్మకు బుధవరాం కేసీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామానికి నిధులు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో గ్రామాభివృద్ధికి బాటలు పడనుంది.
ప్రగతి సింగారం ప్రగతికి రూ.10 కోట్లు.. గ్రామంపై సీఎం వరాలు #KCR #Telangana pic.twitter.com/xgZH1H1J6d
— Oneindia Telugu (@oneindiatelugu) August 14, 2019

ఎమ్మెల్యే ధర్మారెడ్డి తండ్రి మల్లారెడ్డి ఈ నెల 4న అనారోగ్యంతో చనిపోయిన సంగతి తెలిసిందే. బుధవారం ఆయన దశదినకర్మకు సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ధర్మారెడ్డిని పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రగతి సింగారం గ్రామం గురించి చర్చించారు. తర్వాతే సీఎం కేసీఆర్ వరాలు ప్రకటించారు. సీఎం కేసీఆర్తో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మాజీ స్పీకర్ మధుసూదనచారి తదితరులు ఉన్నారు.












Click it and Unblock the Notifications