లక్ష్మీనర్సింహస్వామికి కెసిఆర్ పట్టువస్త్రాలు(ఫొటోలు)
హైదరాబాద్: మహారాష్ట్ర ప్రజలకు ఆరాధ్యుడు, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత వివి శిర్వద్కర్ జన్మదిన వేడుకలకు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ వేడుకలను శుక్రవారం సాయంత్రం జాంబాగ్లోని వివేవవర్దిని ఎడ్యుకేషన్ సొసైటీ ఘనంగా నిర్వహించనుంది.
ఈ కార్యక్రమం వామన్ నాయక్ మార్గ్ జాంబాగ్లోని వివి కళాశాల ప్రాంగణంలో శుక్రవారం సాయంత్రం 6గంటలకు ప్రారంభం కానుంది. ఈ మేరకు సొసైటీ ప్రధాన కార్యదర్శి విశ్వనాథ్ గోగ్టె ఓ ప్రకటనలో తెలిపారు.
యాదగిరిగుట్ట అభివృద్ధి సంస్థ అధ్యక్షుడిగా కెసిఆర్
నల్గొండ: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారికి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు సతీసమేతంగా పట్టువస్ర్తాలను, తలంబ్రాలను రాష్ట్ర ప్రభుత్వం నుంచి సమర్పించారు. శుక్రవారం సిఎం దంపతులు స్వామివారి అలంకార సేవలో పాల్గొన్నారు. స్వామివారి కల్యాణం నేటి రాత్రి జరగనుంది. కల్యాణ మహాత్సవంలో రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, మంత్రులు జగదీశ్రెడ్డి, ఇంద్రకరణ్రెడ్డి దంపతులు పాల్గొననున్నారు.
తెలంగాణ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టను తిరుపతి తీరుగా అభివృద్ధి చేసేందుకు సీఎం కృతనిశ్చయంతో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భాగంగా గుట్ట అభివృద్ధికి తొలి విడుతలో భాగంగా రూ. 100 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. అంతేగాక, యాదగిరిగుట్ట అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేయబోతున్నారు. ఈ సంస్థకు స్వయం కెసిఆర్ అధ్యక్షుడిగా ఉండబోతున్నట్లు సమాచారం.