బడ్జెట్ ప్రతిపాదనలకు తుది మెరుగులు.. అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష
బడ్జెట్ సమావేశాల ప్రతిపాదనలకు తెలంగాణ ప్రభుత్వం తుది మెరుగులు దిద్దుతోంది. ప్రజా సంక్షేమ పథకాలకు ప్రాధాన్యం ఇస్తోన్న సర్కార్.. నిధులను కూడా వాటికే కేటాయిస్తోంది. నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం.. ఆ దిశగా అడుగులేస్తోంది. 2020-2021 బడ్జెట్ కేటాయింపులపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోకస్ చేశారు.

శుక్రవారం నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ 6వ తేదీన ప్రసంగించారు. తర్వాత సభ వాయిదా పడనుంది. ఈ క్రమంలో బడ్జెట్ కేటాయింపులకు సీఎం కేసీఆర్ తుది మెరుగులు దిద్దారు. బుధవారం ప్రగతి భవన్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. బడ్జెట్ ప్రతిపాదనలను ఫైనల్ చేసినట్టు తెలిసింది.
అంతకుముందు గవర్నర్ తమిళి సై సౌందరరాజన్తో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. బడ్జెట్ సమావేశాలకు సంబంధించి క్యాబినెట్ ఆమోదించిన గవర్నర్ ప్రసంగం ప్రతిని అందజేశారు. సీఎం నిర్వహించిన సమీక్షలో ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణరావు పాల్గొన్నారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications