రాహుల్ తో రేవంత్ భేటీ, ఆ ఆరుగురిపై చర్చ - కీలక నిర్ణయం..!!
తెలంగాణ రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ పార్టీ అధినాయకత్వంతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో పాటుగా.. మంత్రివర్గ విస్తరణ, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పైనా రేవంత్ పార్టీ ముఖ్య నేత రాహుల్ తో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఆరుగురుకి అవకావం పైనా ప్రతిపాదలు కోరారు. ఇక, టీపీసీసీకి కొత్త ఇంఛార్జ్ రావటంతో.. పార్టీ పరంగా తీసుకోవాల్సిన చర్యల పైన నిర్ణయాలు తీసుకున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.
ముఖ్యమంత్రి రేవంత్ ఢిల్లీ పర్యటన ఆసక్తి కరంగా మారింది. తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త ఇంఛార్జ్ ను నియ మిస్తూ ఏఐసీసీ నిర్ణయం తీసుకుంది. తక్కవ కాలంలోనే తెలంగాణ పార్టీ ఇంఛార్జ్ ల మార్పు రాజకీయంగా చర్చకు కారణమవుతోంది. ఇప్పుడు నూతన బాధ్యతలను మీనాక్షి నటరాజన్ కు అప్పగించారు. రాహుల్ టీం లో కీలకంగా ఉన్న మీనాక్షికి తెలంగాణ బాధ్యతలు అప్పగించటం ద్వారా రాష్ట్రంలో వ్యవహారాల పైన పార్టీ హైకమాండ్ మూడ్ ఏంటనేది స్పష్టం అవుతోంది. ఇదే సమయంలో ఢిల్లీ నుంచి వచ్చిన పిలుపు మేరకు సీఎం రేవంత్ పార్టీ అగ్ర నాయకత్వంతో సమావేశం అవుతున్నారు. ఈ భేటీలో కీలక అంశాల పైన చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణ వాయిదా పడుతుండగా.. ఇప్పుడు ఆమోదం దిశగా చర్చ జరుగుతోందని సమాచారం.

కులగణన పూర్తి చేయటంతో సూర్యాపేటలోనూ.. గద్వాల్ లోనూ ఏప్రిల్ నూ సభలు ఏర్పాటు చేయాలని రేవంత్ భావిస్తున్నారు. ఈ సభలకు రేవంత్ ను ఆహ్వానించనున్నారు. ఇక.. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల పూర్తి చేసిన కులగణన, ఎస్సీ వర్గీకరణపై తీసుకున్న నిర్ణయాలను పార్టీ నాయకత్వానికి వివరించనున్నారు. మంత్రివర్గ విస్తరణకు ఈ సారి ఆమోదం లభిస్తుందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. మంత్రివర్గంలో ఎవరికి అవకాశం ఇవ్వాలనే అంశం పైన సామాజిక సమీకరణాల ఆధారంగా తుది జాబితా ఖరారు చేయను న్నారు. అదే విధంగా నామినేటెడ్ పదవుల భర్తీ పైన చర్చించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కు ముందే నామినేటెడ్ పదవులు భర్తీ చేయటం ద్వారా పార్టీలో జోష్ వస్తుందని భావిస్తున్నారు. అందులో భాగంగా ఈ పదవుల ఖరారు పైన నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications