మెస్సీ మేనియా, రేపే రేవంత్ తో మ్యాచ్ - షెడ్యూల్.. వీరికే ఎంట్రీ..!!
హైదరాబాద్ లో మెస్సీ మేనియా కనిపిస్తోంది. ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ హైదరాబాద్ వస్తున్నారు రేపు (శనివారం) ఉప్పల్ స్టేడియంలో సీఎం రేవంత్తో కలిసి మ్యాచ్ ఆడనున్నారు. రాత్రి 7 నుంచి 9 వరకు ఉప్పల్ స్టేడియంలో 'మెస్సీ మాయ' అలరించనుంది. తొలుత సెలబ్రిటీలతో ఎగ్జిబిషన్ మ్యాచ్ నిర్వహిస్తారు. ఒక జట్టుకు రేవంత్రెడ్డి..మరో జట్టుకు మెస్సీ సారథ్యం వహిస్తారు. అనంతరం యువ ప్రతిభావంతులతో మెస్సీ మాస్టర్ క్లాస్ కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత పెనాల్టీ షూటౌట్ నిర్వహిస్తారు. చివరగా మ్యూజికల్ కాన్సర్ట్ జరుగుతుంది.
హైదరాబాద్ గరంలో ఫుట్ బాల్ దిగ్గజం మెస్సీ పర్యటన వేళ పండుగ వాతావరణం కనిపిస్తోంది. హైదరాబాద్ కేంద్రంగా మెస్సీ ఫుట్ బాల్ ఆడనున్నారు . ఇందుకు ఉప్పల్ స్టేడియం వేదిక కానుంది. క్రీడాకారుడు లియోనల్ మెస్సీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇమేజ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో కలిసి మ్యాచ్ ఆడనుండటం ఈ పర్యటనలో నే హైలైట్ గా భావిస్తున్నారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేసారు ఉప్పల్ స్టేడియంలో భద్రతా ఏర్పాట్లను డీజీపీ గురువారం పర్యవేక్షించారు. ప్రేక్షకులు ఎలాంటి నిబంధనలు పాటించాలి, భద్రతా నియమాల గురించి మెట్రోరైళ్లు, ప్రధాన కూడళ్లలో బోర్డులతో ప్రచారం చేయాలని సూచించారు. ట్రాఫిక్ మళ్లింపు వివరాలు ముందే ప్రచారం చేయాలన్నారు.

23 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న స్టేడియంను భద్రతా అవసరాల రీత్యా నాలుగు సెక్టార్లుగా విభజించా ని చెప్పారు. 39 వేల మంది సామర్థ్యానికి అనుగుణంగా ఏర్పాట్లు చేశామని వివరించారు. ఈనెల 13వ తేదీ సాయంత్రం 4 గంటలకు మెస్సీ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అక్కడి నుంచి బయలుదేరి నేరుగా ఫలక్ నుమా ప్యాలెస్ లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో పాల్గొననున్నారు. ఒక్క ఉప్పల్ స్టేడియంలోనే రాచకొండ పోలీసులు సుమారు 2 వేల మందితో బందోబస్తును ఏర్పాట్లు చేస్తున్నారు. వీరికి అదనంగా స్టేడియం లోపల 1000 మంది వాలంటీర్లు విధుల్లో ఉండనున్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఫలక్నుమా ప్యాలెస్, ఉప్పల్ స్టేడియం వరకు ప్రయాణించే మార్గాలు ఇప్పటికే ఖరారు అయ్యాయి. 13 తేదీ రాత్రికి ఫలక్ నుమా ప్యాలెస్ లో మెస్సీ బస చేస్తారు.
స్టేడియంలో జరిగే మ్యాచ్ కు టికెట్లు, పాస్లు ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా మెస్సీ సాకర్ ఫ్యాన్స్ను అలరించనున్నాడు. మెస్సీతో ప్రత్యేకంగా ఫొటో దిగాలనుకునే వారు రూ.10లక్షలు చెల్లించి అవకాశాన్ని సొంతం చేసుకోవచ్చని నిర్వాహకులు పేర్కొన్నారు. ఇందుకోసం 100 ప్రత్యేకమైన స్లాట్లను ఏర్పాటు చేశారు. ఉప్పల్ స్టేడియంలో జరిగే సాకర్ మ్యాచ్లో సహచర ప్లేయర్లు రోడ్రిగో డీ పాల్, లుయిస్ సురెజ్తో కలిసి మెస్సీ బరిలో దిగనున్నాడు. 20నిమిషాలు జరిగే ఎగ్జిబిషన్ మ్యాచ్లో సింగరేణి ఆర్ఆర్-9 టీమ్, మెస్సీ ఆల్స్టార్స్ తలపడనున్నాయి. షూటౌట్ సెగ్మెంట్లో పిల్లలకు మెస్సీ మెళకువలు నేర్పించనున్నాడు. ఉప్పల్ స్టేడియంలో మ్యూజికల్ కన్సర్ట్ ఉంటుందని నిర్వాహకులు పేర్కొన్నారు. రాత్రికి హైదరాబాద్లో బస చేసే మెస్సీ..ఆదివారం ముంబైకి బయల్దేరి వెళ్లనున్నాడు.
-
మందుబాబులకు బిగ్ షాక్.. రేపు వైన్ షాప్ లు బంద్.. -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!!












Click it and Unblock the Notifications