Revanth Reddy: ఐటీఐలను ఏటీసీలుగా మార్పు..!
విద్యకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఐటీఐలను ఏటీసీలుగా మారుస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. మల్లేపల్లి ఐటీఐలో అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ కు భూమి పూజ చేసిన రేవంత్.. స్కిల్ డెవలప్మెంట్ కోసమే ఐటీఐని ఏటీసీగా మారుస్తున్నట్లు వివరించారు. 50 కోట్లతో మల్లేపల్లిలో ఏటీసీని నిర్మిస్తున్నామని ప్రకటించారు. పదేండ్లుగా ఐటీఐలు నిరుపయోగంగా మారాయని తెలిపారు.
యువతనకు నైపుణ్యాన్ని అందిస్తే ప్రపంచంతో పోటీ పడతారని చెప్పారు. 40 లక్షల మంది యువత ఉద్యోగం లేక బాధపడుతున్నారని గుర్తు చేశారు. సాంకేతిక నైపుణ్యమే ఉద్యోగ అవకాశాలకు దారి చూపించే దిశగా తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. సర్టిఫికెట్లు జీవన ప్రమాణాలను పెంచవని.. ప్రపంచంతో పోటీపడాలంటే సర్టిఫికెట్లతో పాటు సాంకేతికత కూడా అవసరమని సీఎం రేవంత్ తేల్చి చెప్పారు.

విద్యార్థులకు విద్య, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడమే తమ ప్రభుత్వం ప్రధాన లక్ష్యమన్నారు. తాము పాలకులం కాదు..సేవకులం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రూ. 2324 కోట్లతో 64 ఐటీఐలను ఏటీసీలుగా మారుస్తున్నట్లు వివరించారు. సాంకేతికతను అందించడానికి ముందుకొచ్చిన టాటాకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు. ఐటీ రంగంలో ప్రతి నలులగురిలో ఒకరు తెలుగు వాళ్లు ఉన్నారన్నారని పేర్కొన్నారు.
త్వరలో అన్ని ప్రాంతాల్లో ఏటీసీలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. నిరుద్యోగలుకు శిక్షణ ఇచ్చి నైపుణ్యం పెంచడమే తమ ముందున్న లక్ష్యమన్నారు. అంతకు ముందు కరీంనగర్ బస్ స్టేషన్లో గర్భిణికి కాన్పు చేసి మానవత్వం చాటుకున్న టీజీఎస్ఆర్టీసీ మహిళా సిబ్బందికి రేవంత్ రెడ్డి అభినందించారు.
-
మూసీపై దుష్ప్రచారం నమ్మొద్దు.. బాధ్యత నాదే - సీఎం రేవంత్ -
మహిళలను వేధిస్తే ఇక అంతే.. సీఎం రేవంత్ సీరియస్ వార్నింగ్ ! -
కాంగ్రెస్ లో పదవుల జాతర: నామినేటెడ్ పదవుల్లో యువరక్తం? -
మాటలతో, మూటలతో ఎన్నికల్లో గెలిచేవాళ్లం కాదు - సీఎం రేవంత్ రెడ్డి -
కర్ణాటకలో 'రోహిత్ వేముల చట్టం'..! కుల వివక్షను అరికట్టేందుకే.. -
కేరళంలో 5 గ్యారంటీలను ప్రకటించిన రాహుల్ గాంధీ.. -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, మూడు రోజుల్లో పూర్తి..!! -
రేపటి నుంచి గ్యాస్ సిలిండర్లు బంద్, షాకిచ్చిన ప్రభుత్వం -
కియారా బికీనీ వివాదం రీ ఓపెన్.. వర్మ మాటలతో మళ్లీ రచ్చ! -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
కుప్ప కూలుతున్న బంగారం ధరలు- బిగ్ డౌన్ ఫాల్ -
మార్చి 21 తర్వాత పాకిస్తాన్ ఉండదు- రాసిపెట్టుకోండి: బాంబు పేల్చిన జ్యోతిష్యురాలు












Click it and Unblock the Notifications