ఫ్యూచర్ సిటీపై రేవంత్ బిగ్ స్టెప్..!!
భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పరిశీలించారు. అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమ్మిట్కు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉన్నందున ఏర్పాట్లు అంతర్జాతీయ స్థాయిలో ఉండాలని అన్నారు. సమ్మిట్తో సంబంధం లేని వ్యక్తులు ఎవరూ ప్రాంగణంలోకి రావడానికి వీల్లేదని స్పష్టం చేశారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తవుతున్నందున తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్.. డిసెంబర్ 8, 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు కానుంది. దీనికోసం మీర్ఖాన్పేట్లో జరుగుతున్న ఏర్పాట్లను రేవంత్ రెడ్డి స్వయంగా పరిశీలించారు. అక్కడే అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పలు సూచనలు చేశారు. వివిధ దేశాల నుంచి అంబాసిడర్లు, ఉన్నతస్థాయి ప్రతినిధులు పాల్గొనే అవకాశం ఉందని, సమ్మిట్లో పాల్గొనే ప్రతినిధులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదని చెప్పారు.

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సమ్మిట్ కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అన్నారు. పాసులు లేకుండా, సమ్మిట్తో సంబంధం లేని వ్యక్తులు ఎవరూ ప్రాంగణంలోకి రావడానికి వీలులేదని స్పష్టం చేశారు. శాఖల వారిగా నిర్దేశించిన అధికారులకు ప్రవేశం ఉండాలని, పార్కింగ్కు, బందోబస్తులో పాల్గొనే పోలీసులకు ఎక్కడా ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. ఇక్కడ నిర్మితమౌతోన్న యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పనులను కూడా ఆయన పరిశీలించారు.
రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం రూపొందించే పాలసీ ఆధారంగానే భవిష్యత్తు నిర్ణయాలు తీసుకోవడానికి వీలవుతుందని, విధానపరమైన ప్రణాళిక ఉంటే పెట్టుబడిదారులకు ఒక స్పష్టత వస్తుందని చెప్పారు. పెట్టుబడులను రాబట్టుకోవడం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో రాష్ట్రం అగ్రగామిగా కొనసాగుతుందని అన్నారు. భారీ పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి వీలుగా పారిశ్రామిక విధానాలను అమలులోకి తీసుకొచ్చామని చెప్పారు.
పాలసీ డాక్యుమెంట్ ప్రభుత్వంలోని శాఖల వారిగా ఉండాలని, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 లో ఆయా అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ నెలాఖరులోగా శాఖల వారిగా పాలసీ డాక్యుమెంట్ సిద్ధం కావాలని చెప్పారు. గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లు, సంబంధిత ఇతర అంశాలపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తామని, సమ్మిట్ను విజయవంతం చేయడంలో అధికారులు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు.
-
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
హైదరాబాద్లో మాజీ సీఎం ఆస్తి సీజ్.. గంటల్లోనే విముక్తి! అసలేం జరిగింది? -
కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!! -
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
దేశంలో మోస్ట్ పవర్ ఫుల్ లీడర్ గా చంద్రబాబు.. ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ!












Click it and Unblock the Notifications